శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు మార్చి 18 నుంచి
- January 29, 2018
భద్రాచలం : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. వైదికకమిటీ తేదీలను ఖరారుచేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మార్చి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, 26న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 27న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీ విలంభినామ సంవత్సర వసంత పక్ష తిరుకల్యాణ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఉగాది రోజైన మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ తేదీలను ఖరారుచేసింది. మార్చి 22న పంచమి రోజున ఈ ఉత్సవాలకు అంకురారోపణ గావించనున్నారు. అదేరోజు గరుడాదివాసం వేడుక జరుపుతా రు. మార్చి 24న గజారోహణం, 25న ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. 26న శ్రీరామనవమి వేడుక (శ్రీసీతారాముల కల్యాణం),27న శ్రీరామ పట్టాభిషేకం, అదేరోజు రాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. 28న సదశ్యం, 29న స్వామివారి తెప్పోత్సవం, తాతగుడి సెంటర్లో దొంగలదోపు ఉత్సవం, 30న ఊంజల్సేవ, 31న వసంతోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్1న చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ద్వాదశహారతులు, కంకణ ఉద్వాసన, గరుడపట ఉద్వాసన తదితర వాటిని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









