ఆ పాస్‌పోర్ట్‌లు ఇంకా లేవు

- January 31, 2018 , by Maagulf
ఆ పాస్‌పోర్ట్‌లు ఇంకా లేవు

కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టులపై రెండు కీలక ప్రకటనలు చేసింది. ఆరెంజ్ కలర్ పాస్‌పోర్టు, అలాగే వ్యక్తిగత చిరునామా లేకుండా చివరి పేజీ ముద్రణ అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ రెండింటిపై ప్రస్తుతానికి ఎలాంటి ముందడగు లేదని విదేశాంగశాఖ తేల్చి చెప్పింది. మంగళవారం నాటి ప్రకటనలో విదేశాంగ శాఖ ఈ విషయాలు తెలిపింది.

కొన్ని వారాల క్రితం ఆరెంజ్ కలర్ పాస్‌పోర్ట్ తీసుకొస్తున్నట్టు విదేశాంగ శాఖ, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించాయి. పదో తరగతి పూర్తికాని వారికి ఆరెంజ్ కలర్ పాస్‌పోర్ట్ ఇస్తామని ఆ ప్రకటన సారాంశం. అయితే ఇది వ్యక్తులను కించపరచడమేనని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో దీనిపై వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. చర్చోప చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com