గోవా: అక్రమంగా తరలిస్తున్న 720 గ్రాముల బంగారాన్ని గోవాలోని డబొలిమ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఎయిర్ ఇండియా విమానం నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.