యాప్ దొంగని పట్టించింది
- February 01, 2018తెల్లవారుజామున నాలుగ్గంటల సమయంలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎక్కడినుంచో వచ్చారు ముగ్గురు యువకులు అతడి చేతిలోని ఫోన్ లాక్కుని పరారయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారు జామున ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడి చేతిలో సెల్ ఫోను ఉంది. దూరం నుంచి గమనించిన ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని పరారయ్యారు. అతడు తేరుకునే లోపే వచ్చిన ముగ్గురూ కనిపించకుండా పోయారు. దీంతో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించాడు. కంప్లైంట్ తీసుకున్న వెంటనే రంగలోకి దిగిన పోలీసులు చోరుల కోసం గాలింపు జరిపారు. కంప్లైంట్ దారుడు ఫోన్లో 'ఫైండ్ మై డివైజ్' అనే యాప్ ఉన్నట్లు పోలీసులకు తెలియజేశాడు. వెంటనే పోలీసులు గూగుల్ మ్యాప్లో ఫోన్ ఎక్కడ ఉందీ గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా చీకటిగా ఉండడంతో ఎవరూ కనిపించలేదు. అయితే అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలు తనిఖీ చేయగా అందులో ఒక వాహనం సైలెన్సర్ వేడిగా ఉండడాన్ని గుర్తించారు. దొంగ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడని భావించిన పోలీసులు అక్కడే కొద్ది సేపు గమనించారు. వాహనదారుడిని గుర్తించారు. అరగంట వ్యవధిలోనే వారిని పట్టుకున్నారు. అతడితో పాటు సహకరించిన మరో ఇద్దరినీ కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితులను వెంటనే పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..