ప్రవాసియ భారతీయుడికి ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ లో దక్కిన రూ. 17.45 కోట్లు
- February 05, 2018_1517833045.jpg)
అబుదాబి : ఎడారిలో ఒయాసిస్సు ఎలా ఊరట ఇస్తుందో ...అధేవిధంగా పిల్లాపాపలను వదిలి ఎడారి దేశాలకు బతుకుజీవుడా అని వెళ్లిన ప్రవాసియలను పలు లాటరీలు వారి జీవితంపై పన్నీటి జల్లు కురిపిస్తున్నాయి. అదృష్టం అనేది అత్యధికులకు కుంటుతూ అత్యంత నెమ్మదిగా వస్తుంది.కానీ అతి తక్కువమందికి అదే అదృష్టం ఆఘమేఘాలపై వస్తుంది. యూఏఈలోని దుబాయ్ నగరంలో నివాసముంటున్న కేరళకు చెందిన ఓ భారతీయుడికి అబుదాబిలో నిర్వహించే ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ స్వంతమైంది. దీంతో ఆ వ్యక్తికి రూ. 17.45 కోట్లు దక్కింది. సునిల్ మప్పట్ట కుట్టీ నాయర్ అనే లక్ష్మీ పుత్రుడు ప్రస్తుతం భారత్కు వస్తున్నాడని ‘‘బిగ్ టికెట్ డ్రా’’ నిర్వహకులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఈ ఏడాది ‘‘ ది బిగ్ టెన్ సిరీస్ 188’’లో అబుదాబిలో ప్రకటించిన లక్కీ డ్రాల్లో ఇది రెండవ అతిపెద్ద డ్రా. గత నెలలో భారత్కు చెందిన దుబాయ్లో అజ్మాన్ ప్రాంతంలో నివాసముండే హరిక్రిష్ణన్ నాయర్ అనే వ్యక్తికి 12 మిలియన్ దిర్హమ్ల భారీ లక్కీ డ్రా వరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి