ప్రవాసియ భారతీయుడికి ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ లో దక్కిన రూ. 17.45 కోట్లు
- February 05, 2018
అబుదాబి : ఎడారిలో ఒయాసిస్సు ఎలా ఊరట ఇస్తుందో ...అధేవిధంగా పిల్లాపాపలను వదిలి ఎడారి దేశాలకు బతుకుజీవుడా అని వెళ్లిన ప్రవాసియలను పలు లాటరీలు వారి జీవితంపై పన్నీటి జల్లు కురిపిస్తున్నాయి. అదృష్టం అనేది అత్యధికులకు కుంటుతూ అత్యంత నెమ్మదిగా వస్తుంది.కానీ అతి తక్కువమందికి అదే అదృష్టం ఆఘమేఘాలపై వస్తుంది. యూఏఈలోని దుబాయ్ నగరంలో నివాసముంటున్న కేరళకు చెందిన ఓ భారతీయుడికి అబుదాబిలో నిర్వహించే ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ స్వంతమైంది. దీంతో ఆ వ్యక్తికి రూ. 17.45 కోట్లు దక్కింది. సునిల్ మప్పట్ట కుట్టీ నాయర్ అనే లక్ష్మీ పుత్రుడు ప్రస్తుతం భారత్కు వస్తున్నాడని ‘‘బిగ్ టికెట్ డ్రా’’ నిర్వహకులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఈ ఏడాది ‘‘ ది బిగ్ టెన్ సిరీస్ 188’’లో అబుదాబిలో ప్రకటించిన లక్కీ డ్రాల్లో ఇది రెండవ అతిపెద్ద డ్రా. గత నెలలో భారత్కు చెందిన దుబాయ్లో అజ్మాన్ ప్రాంతంలో నివాసముండే హరిక్రిష్ణన్ నాయర్ అనే వ్యక్తికి 12 మిలియన్ దిర్హమ్ల భారీ లక్కీ డ్రా వరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!







