ప్రవాసియ భారతీయుడికి ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ లో దక్కిన రూ. 17.45 కోట్లు
- February 05, 2018
అబుదాబి : ఎడారిలో ఒయాసిస్సు ఎలా ఊరట ఇస్తుందో ...అధేవిధంగా పిల్లాపాపలను వదిలి ఎడారి దేశాలకు బతుకుజీవుడా అని వెళ్లిన ప్రవాసియలను పలు లాటరీలు వారి జీవితంపై పన్నీటి జల్లు కురిపిస్తున్నాయి. అదృష్టం అనేది అత్యధికులకు కుంటుతూ అత్యంత నెమ్మదిగా వస్తుంది.కానీ అతి తక్కువమందికి అదే అదృష్టం ఆఘమేఘాలపై వస్తుంది. యూఏఈలోని దుబాయ్ నగరంలో నివాసముంటున్న కేరళకు చెందిన ఓ భారతీయుడికి అబుదాబిలో నిర్వహించే ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ స్వంతమైంది. దీంతో ఆ వ్యక్తికి రూ. 17.45 కోట్లు దక్కింది. సునిల్ మప్పట్ట కుట్టీ నాయర్ అనే లక్ష్మీ పుత్రుడు ప్రస్తుతం భారత్కు వస్తున్నాడని ‘‘బిగ్ టికెట్ డ్రా’’ నిర్వహకులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఈ ఏడాది ‘‘ ది బిగ్ టెన్ సిరీస్ 188’’లో అబుదాబిలో ప్రకటించిన లక్కీ డ్రాల్లో ఇది రెండవ అతిపెద్ద డ్రా. గత నెలలో భారత్కు చెందిన దుబాయ్లో అజ్మాన్ ప్రాంతంలో నివాసముండే హరిక్రిష్ణన్ నాయర్ అనే వ్యక్తికి 12 మిలియన్ దిర్హమ్ల భారీ లక్కీ డ్రా వరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!









