విద్యార్థులకు కౌన్సిలింగ్‌ సెషన్స్‌ ప్రారంభించిన ఇండియన్‌ స్కూల్స్‌

- February 05, 2018 , by Maagulf
విద్యార్థులకు కౌన్సిలింగ్‌ సెషన్స్‌ ప్రారంభించిన ఇండియన్‌ స్కూల్స్‌

మస్కట్‌: గ్రేడ్‌ 10, 12 బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కోసం ఒమన్‌లోని ఇండియన్‌ స్కూల్స్‌ తమ విద్యార్థులకు ప్రీ ఎగ్జామ్‌ సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభించాయి. ఏప్రిల్‌ 13 వరకు ఈ కౌన్సిలింగ్‌ జరుగుతుంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) యాన్యువల్‌ కౌన్సిలింగ్‌ ప్రోగ్రామ్‌, ప్రపంచ వ్యాప్తంగా స్టూడెంట్స్‌ మరియు పేరెంట్స్‌కి నిర్వహిస్తూ వస్తోంది. ఇండియన్‌ స్కూల్‌ దర్‌సైత్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీదేవి పి తష్‌నాథ్‌ మరోసారి సిబిఎస్‌ఇ ప్రీ ఎగ్జామ్‌ సైకలాజికల్‌ కౌన్సిలర్‌గా ఒమన్‌లో నియమితులయ్యారు. సాధారణ సైకలాజికల్‌ సమస్యలకు, ఎగ్జామ్‌ రిలేటెడ్‌ స్ట్రెస్‌కి సంబంధించిన సమస్యలనుంచి బయటపడేందుకు ఆమె నేతృత్వంలో కౌన్సిలింగ్‌ కార్యక్రమాలు జరుగుతాయి. సిబిఎస్‌ఇ వరుసగా ఐదోసారి ఆమెను కౌన్సిలర్‌గా నియమించడం జరిగింది. మార్చిలో జరిగే పరీక్షలకు మాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కౌన్సిలింగ్‌ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి 13 ఏప్రిల్‌ వరకు ఈ కౌన్సిలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com