విద్యార్థులకు కౌన్సిలింగ్ సెషన్స్ ప్రారంభించిన ఇండియన్ స్కూల్స్
- February 05, 2018
మస్కట్: గ్రేడ్ 10, 12 బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ఒమన్లోని ఇండియన్ స్కూల్స్ తమ విద్యార్థులకు ప్రీ ఎగ్జామ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ప్రారంభించాయి. ఏప్రిల్ 13 వరకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) యాన్యువల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్, ప్రపంచ వ్యాప్తంగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్కి నిర్వహిస్తూ వస్తోంది. ఇండియన్ స్కూల్ దర్సైత్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి పి తష్నాథ్ మరోసారి సిబిఎస్ఇ ప్రీ ఎగ్జామ్ సైకలాజికల్ కౌన్సిలర్గా ఒమన్లో నియమితులయ్యారు. సాధారణ సైకలాజికల్ సమస్యలకు, ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రెస్కి సంబంధించిన సమస్యలనుంచి బయటపడేందుకు ఆమె నేతృత్వంలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. సిబిఎస్ఇ వరుసగా ఐదోసారి ఆమెను కౌన్సిలర్గా నియమించడం జరిగింది. మార్చిలో జరిగే పరీక్షలకు మాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కౌన్సిలింగ్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి 13 ఏప్రిల్ వరకు ఈ కౌన్సిలింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









