విద్యార్థులకు కౌన్సిలింగ్ సెషన్స్ ప్రారంభించిన ఇండియన్ స్కూల్స్
- February 05, 2018
మస్కట్: గ్రేడ్ 10, 12 బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ఒమన్లోని ఇండియన్ స్కూల్స్ తమ విద్యార్థులకు ప్రీ ఎగ్జామ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ప్రారంభించాయి. ఏప్రిల్ 13 వరకు ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) యాన్యువల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్, ప్రపంచ వ్యాప్తంగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్కి నిర్వహిస్తూ వస్తోంది. ఇండియన్ స్కూల్ దర్సైత్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి పి తష్నాథ్ మరోసారి సిబిఎస్ఇ ప్రీ ఎగ్జామ్ సైకలాజికల్ కౌన్సిలర్గా ఒమన్లో నియమితులయ్యారు. సాధారణ సైకలాజికల్ సమస్యలకు, ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రెస్కి సంబంధించిన సమస్యలనుంచి బయటపడేందుకు ఆమె నేతృత్వంలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. సిబిఎస్ఇ వరుసగా ఐదోసారి ఆమెను కౌన్సిలర్గా నియమించడం జరిగింది. మార్చిలో జరిగే పరీక్షలకు మాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కౌన్సిలింగ్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి 13 ఏప్రిల్ వరకు ఈ కౌన్సిలింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!
- భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!
- కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!
- దుబాయ్లో కొత్త రికార్డు.. ఎమిరేట్స్ హిల్స్లో విల్లాకు Dh17 మిలియన్ల అద్దె..!!
- ఖతార్లో తీవ్రమైన ఎండలు, తేమ.. వాతావరణ శాఖ వెల్లడి..!!







