20 ఏళ్ళ కనిష్టానికి యూఏఈ గోల్డ్‌ జ్యుయెలరీ డిమాండ్‌

- February 05, 2018 , by Maagulf
20 ఏళ్ళ కనిష్టానికి యూఏఈ గోల్డ్‌ జ్యుయెలరీ డిమాండ్‌

యూఏఈలో గోల్డ్‌ జ్యుయెలరీ డిమాండ్‌ వరుసగా నాలుగో ఏడాది కూడా పడిపోయింది. వరల్డ్‌ కౌన్సిల్‌ డేటా ప్రకారం ఇరవయ్యేళ్ళ కనిష్టానికి ఆ డిమాండ్‌ పడిపోయినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో కొంత మేర యూఏఈలో గోల్డ్‌ జ్యుయెలరీకి డిమాండ్‌ పెరిగిందని, వ్యాట్‌ అమలు తర్వాత అది దారుణంగా పడిపోయిందని మార్కెట్‌ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా 2017 చివర్లో గోల్డ్‌కి కొంత మేర డిమాండ్‌ పెరిగింది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో 4 శాతం వరకు డిమాండ్‌ పెరిగింది. 2013 తర్వాత ఈ గ్రోత్‌ కనిపించడం ఇదే తొలిసారి. ఇండియా, చైనా జ్యుయెలరీ విభాగంలో 4 శాతం రికవరీని నమోదు చేసినా, చారిత్రక సరాసరి నుంచి తగ్గుదలే నమోదు చేసినట్లు వరల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. ట్యాక్స్‌ రెగ్యులేషన్‌ కారణంగా ఇండియాలో డిమాండ్‌ ఫ్లక్చుయేట్‌ అవుతూ వస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com