20 ఏళ్ళ కనిష్టానికి యూఏఈ గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్
- February 05, 2018
యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా పడిపోయింది. వరల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం ఇరవయ్యేళ్ళ కనిష్టానికి ఆ డిమాండ్ పడిపోయినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో కొంత మేర యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీకి డిమాండ్ పెరిగిందని, వ్యాట్ అమలు తర్వాత అది దారుణంగా పడిపోయిందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా 2017 చివర్లో గోల్డ్కి కొంత మేర డిమాండ్ పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో 4 శాతం వరకు డిమాండ్ పెరిగింది. 2013 తర్వాత ఈ గ్రోత్ కనిపించడం ఇదే తొలిసారి. ఇండియా, చైనా జ్యుయెలరీ విభాగంలో 4 శాతం రికవరీని నమోదు చేసినా, చారిత్రక సరాసరి నుంచి తగ్గుదలే నమోదు చేసినట్లు వరల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ట్యాక్స్ రెగ్యులేషన్ కారణంగా ఇండియాలో డిమాండ్ ఫ్లక్చుయేట్ అవుతూ వస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి