20 ఏళ్ళ కనిష్టానికి యూఏఈ గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్
- February 05, 2018
యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా పడిపోయింది. వరల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం ఇరవయ్యేళ్ళ కనిష్టానికి ఆ డిమాండ్ పడిపోయినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో కొంత మేర యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీకి డిమాండ్ పెరిగిందని, వ్యాట్ అమలు తర్వాత అది దారుణంగా పడిపోయిందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా 2017 చివర్లో గోల్డ్కి కొంత మేర డిమాండ్ పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో 4 శాతం వరకు డిమాండ్ పెరిగింది. 2013 తర్వాత ఈ గ్రోత్ కనిపించడం ఇదే తొలిసారి. ఇండియా, చైనా జ్యుయెలరీ విభాగంలో 4 శాతం రికవరీని నమోదు చేసినా, చారిత్రక సరాసరి నుంచి తగ్గుదలే నమోదు చేసినట్లు వరల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ట్యాక్స్ రెగ్యులేషన్ కారణంగా ఇండియాలో డిమాండ్ ఫ్లక్చుయేట్ అవుతూ వస్తోంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత









