స్వదేశంలో దోచుకొన్నది విదేశంలో దాచారు....
- February 06, 2018
దుబాయ్ : కొల్లగొట్టిన ప్రజాధనంను స్విస్ బ్యాంకులలో దాచుకోవడం పాత విధానం కాగా అక్రమంగా సంపాదించింది దుబాయ్ లో కొందరు విలాసమైన ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసి దాచుకోవడం పరిపాటైంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖులు కొందరు దుబాయ్లో పలుచోట్ల అత్యంత ఖరీదైన విల్లా(ఇళ్లు)లు కొన్నారని జియో న్యూస్ అనే మీడియా సంస్థ సోమవారం ఒక సంచలన వార్త ప్రచురించింది. వీరు ఏ ఒక్కరికి అనుమానం రాకుండా 118 దేశాలకు చెందిన 34 వేల సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో వారు ఖరీదైన భవంతులు కొనుగోలు చేశారని ఆ వార్త పేర్కొంటుంది. మొత్తం 34 వేల ధనిక కుటుంబాలు నివసించే ఆ విల్లాల్లో కేవలం పాకిస్తాన్ కుటుంబాలే 7వేలు ఉన్నాయంటోంది. వీరిలో ముఖ్యంగా రాజకీయనాయకులు, మాజీ న్యాయమూర్తులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు , లాయర్లు, గాయకులు, నటులు ఇలా పేరొందిన చాలా మంది పాకిస్తానీయులు 11లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దుబాయ్లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







