స్వదేశంలో దోచుకొన్నది విదేశంలో దాచారు....
- February 06, 2018
దుబాయ్ : కొల్లగొట్టిన ప్రజాధనంను స్విస్ బ్యాంకులలో దాచుకోవడం పాత విధానం కాగా అక్రమంగా సంపాదించింది దుబాయ్ లో కొందరు విలాసమైన ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసి దాచుకోవడం పరిపాటైంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖులు కొందరు దుబాయ్లో పలుచోట్ల అత్యంత ఖరీదైన విల్లా(ఇళ్లు)లు కొన్నారని జియో న్యూస్ అనే మీడియా సంస్థ సోమవారం ఒక సంచలన వార్త ప్రచురించింది. వీరు ఏ ఒక్కరికి అనుమానం రాకుండా 118 దేశాలకు చెందిన 34 వేల సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో వారు ఖరీదైన భవంతులు కొనుగోలు చేశారని ఆ వార్త పేర్కొంటుంది. మొత్తం 34 వేల ధనిక కుటుంబాలు నివసించే ఆ విల్లాల్లో కేవలం పాకిస్తాన్ కుటుంబాలే 7వేలు ఉన్నాయంటోంది. వీరిలో ముఖ్యంగా రాజకీయనాయకులు, మాజీ న్యాయమూర్తులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు , లాయర్లు, గాయకులు, నటులు ఇలా పేరొందిన చాలా మంది పాకిస్తానీయులు 11లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దుబాయ్లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









