డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు తగ్గింపు: మార్చ్ 1 నుంచి అమల్లోకి
- February 06, 2018
మస్కట్: డ్రైవింగ్ లైసెన్స్ పీజుని మార్చి 1 నుంచి తగ్గిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఇంతకు ముందు ఈ ఫీజు 20 ఒమన్ రియాల్స్ ఉండగా, ఇప్పుడది 10 ఒమన్ రియాల్స్కి తగ్గనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ అధికారి ఒకరు మాట్లాడుతూ, లెర్నింగ్ లైసెన్స్ ఫీజుని ఒమనీయులు, అలాగే వలసదారులకి ఇకపై 10 ఒమన్ రియాల్స్ మాత్రమే ఉంటుందని చెప్పారు. వలసదారులు మాత్రం రెండేళ్ళకోసారి ఈ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెండేళ్ళ కోసం అదనంగా 10 ఒమన్ రియాల్స్ చెల్లించాలి. 20 ఒమన్ రియాల్స్తో, ఒమనీయులు పదేళ్ళకోసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మార్చి 1 నుంచి రాయల్ ఒమన్ పోలీసులు కొత్త రూల్స్ని అమల్లోకి తెస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. టెంపరరీ లైసెన్స్ ఉన్న వ్యక్తి పది బ్లాక్ పాయింట్స్ పొందితే, మరిన్ని డ్రైవింగ్ లెసన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలో ఏడు బ్లాక్ పాయింట్స్ నమోదైతే టెంపరరీ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు మాత్రమే పొడిగిస్తారు. ఒమనీ డ్రైవర్స్ ఆరు లేదా అంతకన్నా తక్కువ బ్లాక్ పాయింట్స్ పొందితే పదేళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ దక్కుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి