ఐపీఎల్లోకి ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్'రీ'ఎంట్రీ
- February 07, 2018
న్యూదిల్లీ: విజయవంతంగా 10 సీజన్లు పూర్తి చేసుకొని మరికొన్ని రోజుల్లో పదకొండో సీజన్లోకి అడుగుపెట్టబోతోంది ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్). ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు కోచింగ్, సహాయ సిబ్బందిని నియమించుకునే పనిలో ఉన్నాయి. లీగ్లోని కొన్ని జట్లు పాత వారినే కొనసాగిస్తుండగా మరికొన్ని ఫ్రాంఛైజీలు తెరవెనుక ఉండి నడిపించే సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు(2016, 17) సీజన్లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2018 సీజన్లో పునరాగమనం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై దాదాపు మునుపటి సహాయ సిబ్బందిని కొనసాగిస్తుండగా.. రాజస్థాన్కు మాత్రం ఎలాంటి మార్గనిర్దేశకుడు లేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్లోనే తన సారథ్యంలో టైటిల్ సాధించిపెట్టాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. అంతర్జాతీయ క్రికెట్లో అనుభవజ్ఞుడు, మ్యాచ్ విశ్లేషకుడు, వ్యాఖ్యత అయిన వార్న్ సేవలను ఉపయోగించుకోవాలని రాజస్థాన్ యాజమాన్యం నిర్ణయించుకుంది. ఆ జట్టు ప్రధాన కోచ్గా అతడిని నియమించే అవకాశం ఉంది.
ఐతే గత కొద్ది రోజులుగా వార్న్ మళ్లీ ఐపీఎల్లోకి పునరాగమనం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పిన్ మాంత్రికుడు స్పందించాడు. 'మీ అందరికీ ఈ వారంలో ఓ ప్రకటన చేయబోతున్నా. ఎంతో ఆత్రుతగా ఉన్నా.
ఐపీఎల్-2018లో భాగస్వామ్యం కాబోతున్నా' అని వార్న్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా కొన్ని ఫ్రాంఛైజీలు షేన్కు స్వాగతం పలికాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







