ఐపీఎల్లోకి ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్'రీ'ఎంట్రీ
- February 07, 2018
న్యూదిల్లీ: విజయవంతంగా 10 సీజన్లు పూర్తి చేసుకొని మరికొన్ని రోజుల్లో పదకొండో సీజన్లోకి అడుగుపెట్టబోతోంది ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్). ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు కోచింగ్, సహాయ సిబ్బందిని నియమించుకునే పనిలో ఉన్నాయి. లీగ్లోని కొన్ని జట్లు పాత వారినే కొనసాగిస్తుండగా మరికొన్ని ఫ్రాంఛైజీలు తెరవెనుక ఉండి నడిపించే సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు(2016, 17) సీజన్లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2018 సీజన్లో పునరాగమనం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై దాదాపు మునుపటి సహాయ సిబ్బందిని కొనసాగిస్తుండగా.. రాజస్థాన్కు మాత్రం ఎలాంటి మార్గనిర్దేశకుడు లేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్లోనే తన సారథ్యంలో టైటిల్ సాధించిపెట్టాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. అంతర్జాతీయ క్రికెట్లో అనుభవజ్ఞుడు, మ్యాచ్ విశ్లేషకుడు, వ్యాఖ్యత అయిన వార్న్ సేవలను ఉపయోగించుకోవాలని రాజస్థాన్ యాజమాన్యం నిర్ణయించుకుంది. ఆ జట్టు ప్రధాన కోచ్గా అతడిని నియమించే అవకాశం ఉంది.
ఐతే గత కొద్ది రోజులుగా వార్న్ మళ్లీ ఐపీఎల్లోకి పునరాగమనం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పిన్ మాంత్రికుడు స్పందించాడు. 'మీ అందరికీ ఈ వారంలో ఓ ప్రకటన చేయబోతున్నా. ఎంతో ఆత్రుతగా ఉన్నా.
ఐపీఎల్-2018లో భాగస్వామ్యం కాబోతున్నా' అని వార్న్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా కొన్ని ఫ్రాంఛైజీలు షేన్కు స్వాగతం పలికాయి.
తాజా వార్తలు
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్









