దుబాయి బిజినెస్ బే ప్రాంతంలో నిప్పంటుకున్న 32 అంతస్తుల కార్యాలయ భవనం

- November 25, 2015 , by Maagulf
దుబాయి బిజినెస్ బే ప్రాంతంలో నిప్పంటుకున్న  32 అంతస్తుల కార్యాలయ భవనం

 

దుబాయి బిజినెస్ బే ప్రాంతంలోని 32 అంతస్తుల రీగల్ టవర్ యొక్క 26 వ అంతస్తులో మంటలు చెలరేగాయని, ఐదు అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయని దుబాయి సివిల్ డిఫెన్స్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఉదయం 9 గంటల 45 నిముషాల ప్రాంతంలో చెలరేగిన మంటలు శాఖ వారు కేవలం ఒక గంటలోనే నియంత్రించారు. వారు ఇంకా సంఘటనా స్థలంలోనే ఉండి, మరల ప్రజలు తిరిగి ప్రవేశించడానికి యోగ్యంగా తయారు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం మాత్రమే ప్రమాదానికి గల కారణాలు తెలియవస్తాయని, అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com