హాంగ్కాంగ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- February 11, 2018
హాంగ్కాంగ్ : హాంగ్కాంగ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో 18 మంది మృతి చెందగా, 47 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు హార్స్ రేసులను వీక్షించడానికి వేసిన ప్రత్యేక బస్సు, థాయ్ పో నుంచి షాటిన్ రేస్కోర్స్ వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న బస్సు స్టేషన్పైకి దూసుకెళ్లింది. బోల్తా పడిన తర్వాత రెస్క్యూ సిబ్బంది బస్సు టాప్ను కట్ చేసి అందులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు.
ఈ ఘటనపై కోవ్లోన్ మోటర్ బస్సు కంపెనీ లిమిటెడ్ మేనేజర్ సో వాయ్ కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి 80,000 హాంగ్కాంగ్ డాలర్లు(దాదాపు రూ. 6.50 లక్షలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!







