కతార్లో వరదలు - స్తంభించిన జనజీవనం
- November 25, 2015
కతార్ లో బుధవారం కురిసిన భారీ వర్షాలు అక్కడి మార్గాలను దిగ్బంధం చేసి, అక్కడి విద్యాలయాలు, అమెరికా రాయబార కార్యాలయం మూసివేతకు గురిచేశాయి. దోహా విమానాశ్రయ పరిసరాల్లో అతి భారీగా - అంటే 66 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలవల్ల ఇంచుమించు అన్ని మార్గాలు అగమ్యంగా తయారవగా, గత సంవత్సరమే ప్రారంభించబడిన దోహాలోని అంతర్జాతీయ విమానాశ్రయ భవనం కారుతూ ఉండడం వలన వర్షప్రభావానికి గురయిందని సోషల్ మీడియా లో వార్తలు వ్యాప్తిస్తుండగా, సంబంధిత అధికారులు అదేమీ లేదని, విమానాలు సరిగానే నడుస్తున్నాయని ప్రకటించారు. కాగా వర్షాలు, కఠిన వాతావరణం వలన తమ కార్యాలయాన్ని వచ్చే వారం వరకు మూసివేస్తున్నామని అమెరికా రాయబార కార్యాలయం వారు ప్రకటించారు. ఇక, దేశ అంతరంగిక శాఖ వారు ఈ వర్ష పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని వాహన చోదకులను విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







