కతార్లో వరదలు - స్తంభించిన జనజీవనం

- November 25, 2015 , by Maagulf
కతార్లో వరదలు - స్తంభించిన జనజీవనం

 

కతార్ లో బుధవారం కురిసిన భారీ వర్షాలు అక్కడి మార్గాలను దిగ్బంధం చేసి, అక్కడి విద్యాలయాలు, అమెరికా రాయబార కార్యాలయం మూసివేతకు గురిచేశాయి. దోహా విమానాశ్రయ పరిసరాల్లో అతి భారీగా - అంటే 66 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలవల్ల ఇంచుమించు అన్ని మార్గాలు అగమ్యంగా తయారవగా, గత సంవత్సరమే ప్రారంభించబడిన దోహాలోని అంతర్జాతీయ విమానాశ్రయ భవనం కారుతూ ఉండడం వలన వర్షప్రభావానికి గురయిందని సోషల్  మీడియా లో వార్తలు వ్యాప్తిస్తుండగా, సంబంధిత అధికారులు అదేమీ లేదని, విమానాలు సరిగానే నడుస్తున్నాయని ప్రకటించారు. కాగా వర్షాలు, కఠిన వాతావరణం వలన తమ కార్యాలయాన్ని వచ్చే వారం వరకు మూసివేస్తున్నామని అమెరికా రాయబార కార్యాలయం వారు ప్రకటించారు. ఇక, దేశ అంతరంగిక శాఖ వారు ఈ వర్ష పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని వాహన చోదకులను విజ్ఞప్తి చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com