అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి
- February 12, 2018
షార్జా:షార్జాలో సోమవారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగుర్ని బలిగొంది. మృతిచెందినవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మొరాకోకి చెందిన మహిళ, ఆమె ఇద్దరు చిన్నారులు, ఓ భారతీయ పురుషుడు, ఓ పాకిస్తానీ మహిళ మృతి చెందినవారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో సివిల్ డిఫెన్స్, పోలీస్ విభాగాలకు చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఫ్లాట్లోని ఎయిర్ కండిషనర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బ్యాచిలర్స్ వుంటోన్న ఫ్లాట్లోంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి క్రిమినల్ మోటివ్ లేదని పోలీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బయాత్ చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడ్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి