అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి
- February 12, 2018
షార్జా:షార్జాలో సోమవారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగుర్ని బలిగొంది. మృతిచెందినవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మొరాకోకి చెందిన మహిళ, ఆమె ఇద్దరు చిన్నారులు, ఓ భారతీయ పురుషుడు, ఓ పాకిస్తానీ మహిళ మృతి చెందినవారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో సివిల్ డిఫెన్స్, పోలీస్ విభాగాలకు చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఫ్లాట్లోని ఎయిర్ కండిషనర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బ్యాచిలర్స్ వుంటోన్న ఫ్లాట్లోంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి క్రిమినల్ మోటివ్ లేదని పోలీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బయాత్ చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడ్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు







