అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి
- February 12, 2018
షార్జా:షార్జాలో సోమవారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగుర్ని బలిగొంది. మృతిచెందినవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మొరాకోకి చెందిన మహిళ, ఆమె ఇద్దరు చిన్నారులు, ఓ భారతీయ పురుషుడు, ఓ పాకిస్తానీ మహిళ మృతి చెందినవారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో సివిల్ డిఫెన్స్, పోలీస్ విభాగాలకు చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఫ్లాట్లోని ఎయిర్ కండిషనర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బ్యాచిలర్స్ వుంటోన్న ఫ్లాట్లోంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి క్రిమినల్ మోటివ్ లేదని పోలీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బయాత్ చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడ్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







