దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి రస్ అల్ ఖైమాకి స్పెషల్ బస్ సర్వీస్
- February 12, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా టూరిజం డిపార్ట్మెంట్ అథారిటీ, కొత్త షటిల్ సర్వీస్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రస్ అల్ ఖైమాకి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. టెర్మినల్ 1 అలాగే టెర్మినల్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వీస్, రెండు ఎమిరేట్స్ మధ్య కనెక్టివిటీని పెంచుతుందని అధికారులు తెలిపారు. 2018 చివరి నాటికి మిలియన్ విజిటర్స్ని ఆకర్షించే క్రమంలో రస్ అల్ ఖైమా ఈ నిర్ణయం తీసుకుంది.64 కిలోమీటర్ల మేర పొడవైన బీచ్, అరేబియన్ కల్చర్, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని జబెల్ జైస్లోనూ సందర్శకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. షటిల్ సర్వీస్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. రస్ అల్ ఖైమాలోని అన్ని ప్రముఖ హోటల్స్లోనూ పర్యాటకుల్ని డ్రాప్ చేసేలా ఈ షటిల్ సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు. ప్రారంభ ఆఫర్లో భాగంగా 20 దిర్హామ్లకే ఈ సర్వీసుని అందిస్తున్నారు. వైఫై, వాటర్ బాటిల్స్, మ్యాప్స్ ఆన్ బోర్డ్ అందుబాటులో ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 45 నిమిషాలపాటు సాగే ప్రయాణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చుననీ, ప్రకృతి అందాల్ని బస్లోంచి తిలకించవచ్చునని ఆర్ఎకె టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సిఇఓ హైతమ్ మట్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..







