దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి రస్ అల్ ఖైమాకి స్పెషల్ బస్ సర్వీస్
- February 12, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా టూరిజం డిపార్ట్మెంట్ అథారిటీ, కొత్త షటిల్ సర్వీస్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రస్ అల్ ఖైమాకి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. టెర్మినల్ 1 అలాగే టెర్మినల్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వీస్, రెండు ఎమిరేట్స్ మధ్య కనెక్టివిటీని పెంచుతుందని అధికారులు తెలిపారు. 2018 చివరి నాటికి మిలియన్ విజిటర్స్ని ఆకర్షించే క్రమంలో రస్ అల్ ఖైమా ఈ నిర్ణయం తీసుకుంది.64 కిలోమీటర్ల మేర పొడవైన బీచ్, అరేబియన్ కల్చర్, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని జబెల్ జైస్లోనూ సందర్శకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. షటిల్ సర్వీస్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. రస్ అల్ ఖైమాలోని అన్ని ప్రముఖ హోటల్స్లోనూ పర్యాటకుల్ని డ్రాప్ చేసేలా ఈ షటిల్ సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు. ప్రారంభ ఆఫర్లో భాగంగా 20 దిర్హామ్లకే ఈ సర్వీసుని అందిస్తున్నారు. వైఫై, వాటర్ బాటిల్స్, మ్యాప్స్ ఆన్ బోర్డ్ అందుబాటులో ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 45 నిమిషాలపాటు సాగే ప్రయాణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చుననీ, ప్రకృతి అందాల్ని బస్లోంచి తిలకించవచ్చునని ఆర్ఎకె టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సిఇఓ హైతమ్ మట్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి