ఏపీఈడీబీ - వుడ్కో ఎల్ఎల్సి మధ్య ఎంఓయూ
- February 12, 2018
దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ - వుడ్కో ఎల్ఎల్సి సంస్థల మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏపీఈడీబీ, అలాగే యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన వుడ్కో ఎల్ఎల్సి, సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహనా ఒప్పందం విలువ సుమారు 1605 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేదా తిరుపతిలో సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా 100 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. హై క్వాలిటీ ఫర్నిచర్కి సంబంధించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెలకొల్పడం ఈ ఒప్పందం లక్ష్యం. యూఏఈలోని దుబాయ్లో 11 ఫిబ్రవరి 2018న ఈ అవగాహనా ఒప్పందం ఏపీ ప్రభుత్వ సంస్థ ఎపిఇడిబి తరపున కృష్ణ కిషోర్ జాస్తి అలాగే యూఏఈ సంస్థ వుడ్కో ఎల్ఎల్సి తరపున హమీద్ మధ్య కుదిరింది.వీరితో పాటు యశ్వంత్ సమ్మెట(ఎపిఇడిబి,ఎగ్జిక్యూటివ్),ప్రేమ్ చంద్(ఎపిఇడిబి,ఎగ్జిక్యూటివ్) కూడా పాల్గొన్నారు.ఈ ఒప్పందంకి సంభందించిన విషయంలో నాదెళ్ల బాలాజీ(నాదెళ్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి చైర్మన్) మరియు జాఫర్ అలీ ( APNRT కో-ఆర్డినేటర్,యు.ఏ.ఈ) తగిన కృషి చేసారు.

తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







