ఏపీఈడీబీ - వుడ్కో ఎల్ఎల్సి మధ్య ఎంఓయూ
- February 12, 2018దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ - వుడ్కో ఎల్ఎల్సి సంస్థల మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏపీఈడీబీ, అలాగే యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన వుడ్కో ఎల్ఎల్సి, సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహనా ఒప్పందం విలువ సుమారు 1605 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేదా తిరుపతిలో సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా 100 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. హై క్వాలిటీ ఫర్నిచర్కి సంబంధించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెలకొల్పడం ఈ ఒప్పందం లక్ష్యం. యూఏఈలోని దుబాయ్లో 11 ఫిబ్రవరి 2018న ఈ అవగాహనా ఒప్పందం ఏపీ ప్రభుత్వ సంస్థ ఎపిఇడిబి తరపున కృష్ణ కిషోర్ జాస్తి అలాగే యూఏఈ సంస్థ వుడ్కో ఎల్ఎల్సి తరపున హమీద్ మధ్య కుదిరింది.వీరితో పాటు యశ్వంత్ సమ్మెట(ఎపిఇడిబి,ఎగ్జిక్యూటివ్),ప్రేమ్ చంద్(ఎపిఇడిబి,ఎగ్జిక్యూటివ్) కూడా పాల్గొన్నారు.ఈ ఒప్పందంకి సంభందించిన విషయంలో నాదెళ్ల బాలాజీ(నాదెళ్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి చైర్మన్) మరియు జాఫర్ అలీ ( APNRT కో-ఆర్డినేటర్,యు.ఏ.ఈ) తగిన కృషి చేసారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్