భారత్కు ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని
- February 14, 2018
న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు ఆయన పర్యటించనున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రూహానీ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా కలుసుకోనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ మేరకు బలపడ్డాయన్నదానిపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్టు అధికారులు తెలిపారు.. పరస్పర ప్రయోజనం చేకూరే విధంగా ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టిపెట్టనున్నారు. కాగా ప్రధాని మోదీ 2016 మేలో ఇరాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటు... ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాద్ను కూడా సందర్శించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







