భారత్కు ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని
- February 14, 2018
న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు ఆయన పర్యటించనున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రూహానీ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా కలుసుకోనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ మేరకు బలపడ్డాయన్నదానిపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్టు అధికారులు తెలిపారు.. పరస్పర ప్రయోజనం చేకూరే విధంగా ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టిపెట్టనున్నారు. కాగా ప్రధాని మోదీ 2016 మేలో ఇరాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటు... ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాద్ను కూడా సందర్శించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి