భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని

- February 14, 2018 , by Maagulf
భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని

న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రూహాని మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు ఆయన పర్యటించనున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రూహానీ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలుసుకోనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ మేరకు బలపడ్డాయన్నదానిపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్టు అధికారులు తెలిపారు.. పరస్పర ప్రయోజనం చేకూరే విధంగా ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టిపెట్టనున్నారు. కాగా ప్రధాని మోదీ 2016 మేలో ఇరాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటు... ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాద్‌ను కూడా సందర్శించనున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com