నగర వీధులలో చెత్త పారేస్తే భారీ జరిమానా..వెల్లడించిన మున్సిపల్ అధికారులు
- February 15, 2018
యూఏఈ : వీధులలో చెత్త పారవేస్తే భారీ జరిమానా చెల్లించాలని యూఏఈ లోని అల్ ఐన్ నగర మున్సిపాలిటీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు. రోడ్లు, వీధులలో చెత్త చెదారాలను పడేసేవారికి పరిశుభ్రత పాఠాలు నేర్పించేందుకు పురపాలక అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నివాసప్రాంతాలు, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తను పడేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారికి 1000 నుంచి 1,00,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు ప్రకటించారు. మన భారతీయ కరెన్సీలో రూ. 17 వేల నుంచి 17 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అల్ ఐన్ నగర ప్రణాళిక, మున్సిపాలిటీ అధికారులు ఓ నోటిఫికేషన్ను విడుదల చేశారు.సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఈ సమాచారం తెలియచేస్తున్నారు. అల్ ఐన్లోని ప్రవాసీయులు నిబంధనలు పాటించకాపోతే ఎడారి దేశాలలో సంపాదించింది జరిమానాలు చెల్లించేందుకు సరిపోతుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









