నగర వీధులలో చెత్త పారేస్తే భారీ జరిమానా..వెల్లడించిన మున్సిపల్ అధికారులు
- February 15, 2018
యూఏఈ : వీధులలో చెత్త పారవేస్తే భారీ జరిమానా చెల్లించాలని యూఏఈ లోని అల్ ఐన్ నగర మున్సిపాలిటీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు. రోడ్లు, వీధులలో చెత్త చెదారాలను పడేసేవారికి పరిశుభ్రత పాఠాలు నేర్పించేందుకు పురపాలక అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నివాసప్రాంతాలు, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తను పడేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారికి 1000 నుంచి 1,00,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు ప్రకటించారు. మన భారతీయ కరెన్సీలో రూ. 17 వేల నుంచి 17 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అల్ ఐన్ నగర ప్రణాళిక, మున్సిపాలిటీ అధికారులు ఓ నోటిఫికేషన్ను విడుదల చేశారు.సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఈ సమాచారం తెలియచేస్తున్నారు. అల్ ఐన్లోని ప్రవాసీయులు నిబంధనలు పాటించకాపోతే ఎడారి దేశాలలో సంపాదించింది జరిమానాలు చెల్లించేందుకు సరిపోతుంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







