నగర వీధులలో చెత్త పారేస్తే భారీ జరిమానా..వెల్లడించిన మున్సిపల్ అధికారులు
- February 15, 2018
యూఏఈ : వీధులలో చెత్త పారవేస్తే భారీ జరిమానా చెల్లించాలని యూఏఈ లోని అల్ ఐన్ నగర మున్సిపాలిటీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు. రోడ్లు, వీధులలో చెత్త చెదారాలను పడేసేవారికి పరిశుభ్రత పాఠాలు నేర్పించేందుకు పురపాలక అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నివాసప్రాంతాలు, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తను పడేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారికి 1000 నుంచి 1,00,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు ప్రకటించారు. మన భారతీయ కరెన్సీలో రూ. 17 వేల నుంచి 17 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అల్ ఐన్ నగర ప్రణాళిక, మున్సిపాలిటీ అధికారులు ఓ నోటిఫికేషన్ను విడుదల చేశారు.సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఈ సమాచారం తెలియచేస్తున్నారు. అల్ ఐన్లోని ప్రవాసీయులు నిబంధనలు పాటించకాపోతే ఎడారి దేశాలలో సంపాదించింది జరిమానాలు చెల్లించేందుకు సరిపోతుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







