నగర వీధులలో చెత్త పారేస్తే భారీ జరిమానా..వెల్లడించిన మున్సిపల్ అధికారులు
- February 15, 2018
యూఏఈ : వీధులలో చెత్త పారవేస్తే భారీ జరిమానా చెల్లించాలని యూఏఈ లోని అల్ ఐన్ నగర మున్సిపాలిటీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు. రోడ్లు, వీధులలో చెత్త చెదారాలను పడేసేవారికి పరిశుభ్రత పాఠాలు నేర్పించేందుకు పురపాలక అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నివాసప్రాంతాలు, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తను పడేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినవారికి 1000 నుంచి 1,00,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు ప్రకటించారు. మన భారతీయ కరెన్సీలో రూ. 17 వేల నుంచి 17 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు అల్ ఐన్ నగర ప్రణాళిక, మున్సిపాలిటీ అధికారులు ఓ నోటిఫికేషన్ను విడుదల చేశారు.సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఈ సమాచారం తెలియచేస్తున్నారు. అల్ ఐన్లోని ప్రవాసీయులు నిబంధనలు పాటించకాపోతే ఎడారి దేశాలలో సంపాదించింది జరిమానాలు చెల్లించేందుకు సరిపోతుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







