సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు హీరోగా..
- February 16, 2018
తెలుగు పాటను పరుగులు తీయించిన సంగీత దర్శకులలో చక్రవర్తి ఒకరు. ఆయన తనయుడు 'శ్రీ' కూడా కొన్ని సినిమాలకి బాణీలను అందించి, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన అనారోగ్య కారణాల వలన చనిపోయారు. ఆయన కుమారుడు రాజేశ్ శ్రీ చక్రవర్తి హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు.
ఆయన హీరోగా 'శివ కాశీపురం' రూపొందుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో రాజేశ్ శ్రీ చక్రవర్తి జోడీగా ప్రియాంక శర్మ నటిస్తోంది. షూటింగు పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆరంభించనున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







