చేపలు పెరుగు కర్రీ
- February 17, 2018
కావలసిన పదార్థాలు: (చర్మం లేని) కొరమీను చేప - 1 కిలో, నూనె - అరకప్పు, పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయలు - 3, టమేటోలు - 3, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను , అల్లం తరుగు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి (నిలువుగా చీరాలి) - 5, కొత్తిమీర - 1 టేబుల్ స్పూను. ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ధనియాలపొడి - 1 టీ స్పూను, కస్తూరి మెంతి - 2 టీ స్పూన్లు, గరంమసాల - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : చేపని శుభ్రపరిచి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, దనియాలపొడి, కస్తూరిమెంతి, గరం మసాల, అల్లం, వెల్లుల్లి పెరుగులో వేసి బాగా కలిపి చేపముక్కలకు పట్టించి అరగంట పక్కనుంచాలి. కడాయిలో ఉల్లితరుగు దోరగా వేగాక టమోటా ముక్కలు, చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చేపముక్కలు ఉడికి, నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







