చేపలు పెరుగు కర్రీ
- February 17, 2018![10 చేపలు పెరుగు కర్రీ](https://www.maagulf.com/godata/articles/201802/fish_1518924904.jpg)
కావలసిన పదార్థాలు: (చర్మం లేని) కొరమీను చేప - 1 కిలో, నూనె - అరకప్పు, పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయలు - 3, టమేటోలు - 3, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను , అల్లం తరుగు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి (నిలువుగా చీరాలి) - 5, కొత్తిమీర - 1 టేబుల్ స్పూను. ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ధనియాలపొడి - 1 టీ స్పూను, కస్తూరి మెంతి - 2 టీ స్పూన్లు, గరంమసాల - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : చేపని శుభ్రపరిచి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, దనియాలపొడి, కస్తూరిమెంతి, గరం మసాల, అల్లం, వెల్లుల్లి పెరుగులో వేసి బాగా కలిపి చేపముక్కలకు పట్టించి అరగంట పక్కనుంచాలి. కడాయిలో ఉల్లితరుగు దోరగా వేగాక టమోటా ముక్కలు, చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చేపముక్కలు ఉడికి, నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- జనతా క్యాంటీన్ల పై ఈవో ప్రత్యేక దృష్టి
- సినారె 93వ జయంతికి సీఎం రేవంత్ కి ఆహ్వానం
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్