గోపీచంద్‌ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో

- February 18, 2018 , by Maagulf
గోపీచంద్‌ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో

హైదరాబాద్‌: 'ఇంటిలిజెంట్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్‌తేజ్‌ త్వరలో గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నారు. మే నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తు్న్నారు. 'ఇంటిలిజెంట్‌' సినిమాకు వి.వి వినాయక్‌ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. మరి గోపీచంద్‌ దర్శకత్వంలో రాబోయే చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాల్సిందే. త్వరలో ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com