ఏషియన్ రెస్టారెంట్లో వ్యక్తి హత్య
- February 19, 201833 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, ఆసియన్ రెస్టారెంట్లో హత్యకు గురయ్యాడు. నహ్దా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఏషియన్ రెస్టారెంట్లో పాకిస్తానీ వ్యక్తిని పలుమార్లుప పొడిచి చంపారు. మృతుడ్ని ఎంఎ ఖాన్గా గుర్తించాఉ. కిచెన్ నైఫ్తో అతన్ని చంపేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటుండగా, వారి మధ్య తగాదా ప్రారంభమయ్యిందనీ, ఈ క్రమంలోనే ఓ వ్యక్తి, మృతుడ్ని బలంగా పొడిచాడని తెలియవస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఫోరెన్సిక్, సీఐడీ, క్రైమ్ సీన్, పెట్రోల్, అంబులెన్స్ విభాగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. బాధితుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. రెస్టారెంట్లో ఉన్నవారిని విచారించి, వివరాల్ని నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడి అరెస్ట్పై ఖచ్చితమైన సమాచారం లేదు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్