ఒక్క రోజులు మిలియనీర్‌ అయిన భారతీయ వలసదారుడు

- February 20, 2018 , by Maagulf
ఒక్క రోజులు మిలియనీర్‌ అయిన భారతీయ వలసదారుడు

దుబాయ్‌:దుబాయ్‌లో భారత వలసదారుడు సంతీష్‌కుమార్‌, ఒక్క రోజులో మిలియనీర్‌ అయ్యారు. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రఫాలెలో 1 మిలియన్‌ డాలర్‌ గెలుచుకున్నారాయన. 0802 టిక్కెట్‌పై 264 సిరీస్‌లో ఆయన 125వ దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రఫాలెలో 1 మిలియన్‌ డాలర్లు గెల్చుకోవడం జరిగింది. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌, వరల్డ్‌ నెంబర్‌ 3 ఎలినా స్వితోలినా ఈ డ్రా తీశారు. ఈ డ్రాలో మరో ఇద్దరు ఇండియన్స్‌ కూడా విజేతలుగా నిలిచారు. కేరళకి చెందిన కయింగిల్‌ మొహమ్మద్‌ కుట్టి 1678 సిరీస్‌లో 1241 టిక్కెట్‌కి గాను బిఎండబ్ల్యు 640ఐ గ్రాన్‌ టురిస్మో (జుకారో బీజ్‌) కారుని గెలుచుకున్నారు. మరో భారతీయ వలసదారులైన రెజాని సిబి బిఎండబ్ల్యు ఎస్‌ 1000 ఆర్‌ఆర్‌ మోటర్‌ బైక్‌ని గెల్చుకున్నారు. లగ్జరీ మోటర్‌ బైక్‌ని గెలుచుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com