కువైట్ చేరిన APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర

- February 21, 2018 , by Maagulf

కువైట్:కువైట్ లో అనధికారికంగా నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు కువైట్ ప్రభుత్వం తో కలిసి APNRT అందిస్తున్న అమ్నెస్టీ విదితమే. ఈ రోజు అమ్నెస్టీ కార్యక్రమాలని పర్యవేక్షించేందుకు AP NRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ చేసురుకున్నారు. వీరికి ఎయిర్పోర్ట్ లో కువైట్ తెలుగుదేశం అధ్యక్షులు సుధాకర్ రావు, APNRT అధ్యక్షులు వేమూరి రవికుమార్, పలువురు ప్రవాసాంద్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్నెస్టీ(క్షమాభిక్ష) ద్వారా రాష్ట్రానికి త్వరితగతిన తీసుకోచ్చేందుకు జరుగుతున్న ఎర్పాట్లు, తగిన ప్రణాళికపై కువైట్ లోని భారత రాయబారి జీవసాగర్ తో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు APNRT అధ్యక్షులు వేమూరి రవికుమార్, డైరక్టర్ చప్పిడి రాజశేఖర్, APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com