షాకింగ్: టాలీవుడ్ హీరో శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి
- February 21, 2018
ప్రత్యేక హోదా అంశం రోజు రోజుకీ రాజుకుంటోంది. టాలీవుడ్ హీరో శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. హోదా కోసం ఓ తెలుగు చానెల్ నిర్వహిస్తున్న చర్చలో బుధవారం ఉదయం పాల్గొన్నారు. శివాజీ మాట్లాడుతుండగా చర్చలోకి చొరబడ్డ బీజేపీ కార్యకర్తలు.. 'శివాజీ.. డౌన్.. డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఈ తరుణంలో మాటామాటాపెరిగి సంయమనం కోల్పోయిన కార్యకర్తలు శివాజీపై దాడికి దిగారు. హోదా కోసం ప్రశ్నించడాన్ని భరించలేని బీజేపీ కార్యకర్తలు తనపై దాడికి దిగారని శివాజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను ప్రజా సంఘాలు, ప్రజలు అడ్డుకోవడంతో గొడవ సర్దుమనిగింది. ఇదిలా ఉంటే మరోవైపు.. బీజేపీ నేతలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.
విభజన హామీల కోసం న్యాయస్థానానికి వెళ్తాం అనడం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమే అని సినీ నటుడు శివాజీ ఘాటుగా విమర్శించారు. మీరు బాగా పని చేసే సత్తా ఉన్న నాయకులు, కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటూ ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారనే అర్థం ధ్వనించేలా శివాజీ మాట్లాడారు. కేంద్రాన్ని చూసి ఏపీ భయపడుతోందన్నారు. విభజన హామీల సాధన సమితి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. తెలుగు ప్రజల్ని బీజేపీ మోసం చేస్తోందన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఈ ఒక్క ఏడాదైనా నిజాయతీగా పని చేయాలని శివాజీ ఎంపీలను కోరారు. ప్రత్యేక హోదాపై పోరాడేందుకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. మనకు అన్యాయం జరుగుతుంటే పోరాడే నేతలే లేరా అని శివాజీ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాకు పరిశ్రమలను కేటాయించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కమలనాథుల్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖకు రైల్వే జోన్ తదితర హామీలను నెరవెరిస్తే.. 2019లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని శివాజీ ఘంటాపథంగా చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఎంత మేర నిధులు ఇచ్చిందో పురందేశ్వరి లెక్కలు చెప్పాలని శివాజీ డిమాండ్ చేశారు. మాతో ఏపీ పోటీ పడలేదని పొరుగు రాష్ట్రాలు అంటుంటే బాధేస్తోందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







