మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

- February 21, 2018 , by Maagulf
మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: ఈ ఏడాది మానస సరోవర్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డోక్లాంపై ప్రతిష్టంభన నేపథ్యంలో అప్పట్లో చైనా నాథూలా మార్గాన్ని మూసివేసింది. ఇప్పుడా మార్గంలోనూ యాత్రికులు వెళ్లవచ్చునని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ మార్గంలో కూడా మానస సరోవర్ యాత్రకు వెళ్లవచ్చు. జూన్ 8నుంచి నాలుగు నెలలపాటు జరిగే యాత్ర కోసం మార్చి 23 తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com