దేశ తొలి మహిళా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పైలట్గా అవని చతుర్వేది
- February 21, 2018
హైదరాబాద్: దేశ తొలి మహిళా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పైలట్గా అవని చతుర్వేది నిలిచి రికార్డు నెలకొల్పింది. జామ్నగర్ ఎయిర్బేస్ నుంచి సోమవారం నాడు ఒంటరిగా 30 నిమిషాల పాటు మిగ్-21 సూపర్ సోనిక్ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. అత్యుత్తమ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పైలెట్గా ఎగరాలనుకుంటున్నా. ఈ క్రమంలో ప్రతీరోజు నేర్చుకుంటూనే ఉంటానని అవని పేర్కొంది. అవని స్వస్థలం మధ్యప్రదేశ్లోని దియోలాండ్ అనే చిన్న పట్టణం. ఎయిర్చీఫ్ మార్షల్ బీ ఎస్ ధనోవ్ స్పందిస్తూ.. అవనీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహిళా అధికారులను ప్రోత్సహించడంలో ఐఏఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రస్తుత ఫైటర్ పైలట్ల శిక్షణ బ్యాచ్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ మొత్తం ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. వీరిలో అవని చతుర్వేది ఒకరు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







