హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలోభారీ అగ్ని ప్రమాదం,4 గురు మృతి
- February 22, 2018
హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు గోడౌన్లో పనిచేస్తున్నారు. ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిలో 4 గురు మృతి చెందారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటల అదుపునకు యత్నిస్తున్నారు. పక్కనే పలు కంపెనీలు ఉండటంతో వాటిలోకి మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







