హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలోభారీ అగ్ని ప్రమాదం,4 గురు మృతి

- February 22, 2018 , by Maagulf
హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలోభారీ అగ్ని ప్రమాదం,4 గురు మృతి

హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్‌ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు గోడౌన్‌లో పనిచేస్తున్నారు. ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిలో 4 గురు మృతి చెందారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటల అదుపునకు యత్నిస్తున్నారు. పక్కనే పలు కంపెనీలు ఉండటంతో వాటిలోకి మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com