హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలోభారీ అగ్ని ప్రమాదం,4 గురు మృతి
- February 22, 2018
హైదరాబాద్ః జీడిమెట్ల పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు గోడౌన్లో పనిచేస్తున్నారు. ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిలో 4 గురు మృతి చెందారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటల అదుపునకు యత్నిస్తున్నారు. పక్కనే పలు కంపెనీలు ఉండటంతో వాటిలోకి మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







