సిరియా సేనల దాడుల్లో 400 మందికి పైగా మృతి
- February 23, 2018
- సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్రైట్స్ వెల్లడి
డౌమా (సిరియా): సిరియాలోని డౌమా పట్టణంపై ప్రభుత్వ సేనలు, మిత్రదేశం రష్యా సేనలు గత ఐదు రోజులుగా జరిపిన భూతల, వైమానిక దాడుల్లో 95 మంది చిన్నారులతో సహా మొత్తం 403 మంది పౌరులు మరణించారని లండన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. తూర్పు ఘౌట ప్రాంతంపై జరిగిన తాజా బాంబింగ్లో అనేక మంది మరణించటంతో సిరియా సేనలు గత ఐదు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 400 దాటినట్లు ఈ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఒక్కరోజు వైమానిక, భూతల దాడుల్లో దాదాపు 46 మందికి పైగా మరణించారని, ఇప్పటికైనా ఏడున్నరేళ్ల ఈ రక్తపాతానికి తెరదించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు అది విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







