సిరియా సేనల దాడుల్లో 400 మందికి పైగా మృతి

- February 23, 2018 , by Maagulf
సిరియా సేనల దాడుల్లో 400 మందికి పైగా మృతి

- సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌రైట్స్‌ వెల్లడి 
డౌమా (సిరియా): సిరియాలోని డౌమా పట్టణంపై ప్రభుత్వ సేనలు, మిత్రదేశం రష్యా సేనలు గత ఐదు రోజులుగా జరిపిన భూతల, వైమానిక దాడుల్లో 95 మంది చిన్నారులతో సహా మొత్తం 403 మంది పౌరులు మరణించారని లండన్‌కు చెందిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ వెల్లడించింది. తూర్పు ఘౌట ప్రాంతంపై జరిగిన తాజా బాంబింగ్‌లో అనేక మంది మరణించటంతో సిరియా సేనలు గత ఐదు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 400 దాటినట్లు ఈ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఒక్కరోజు వైమానిక, భూతల దాడుల్లో దాదాపు 46 మందికి పైగా మరణించారని, ఇప్పటికైనా ఏడున్నరేళ్ల ఈ రక్తపాతానికి తెరదించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు అది విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com