సిరియా సేనల దాడుల్లో 400 మందికి పైగా మృతి
- February 23, 2018
- సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్రైట్స్ వెల్లడి
డౌమా (సిరియా): సిరియాలోని డౌమా పట్టణంపై ప్రభుత్వ సేనలు, మిత్రదేశం రష్యా సేనలు గత ఐదు రోజులుగా జరిపిన భూతల, వైమానిక దాడుల్లో 95 మంది చిన్నారులతో సహా మొత్తం 403 మంది పౌరులు మరణించారని లండన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. తూర్పు ఘౌట ప్రాంతంపై జరిగిన తాజా బాంబింగ్లో అనేక మంది మరణించటంతో సిరియా సేనలు గత ఐదు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 400 దాటినట్లు ఈ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఒక్కరోజు వైమానిక, భూతల దాడుల్లో దాదాపు 46 మందికి పైగా మరణించారని, ఇప్పటికైనా ఏడున్నరేళ్ల ఈ రక్తపాతానికి తెరదించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు అది విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









