సిరియా సేనల దాడుల్లో 400 మందికి పైగా మృతి
- February 23, 2018
- సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్రైట్స్ వెల్లడి
డౌమా (సిరియా): సిరియాలోని డౌమా పట్టణంపై ప్రభుత్వ సేనలు, మిత్రదేశం రష్యా సేనలు గత ఐదు రోజులుగా జరిపిన భూతల, వైమానిక దాడుల్లో 95 మంది చిన్నారులతో సహా మొత్తం 403 మంది పౌరులు మరణించారని లండన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. తూర్పు ఘౌట ప్రాంతంపై జరిగిన తాజా బాంబింగ్లో అనేక మంది మరణించటంతో సిరియా సేనలు గత ఐదు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 400 దాటినట్లు ఈ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఒక్కరోజు వైమానిక, భూతల దాడుల్లో దాదాపు 46 మందికి పైగా మరణించారని, ఇప్పటికైనా ఏడున్నరేళ్ల ఈ రక్తపాతానికి తెరదించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు అది విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







