'గ్రే లిస్ట్'లోకి పాకిస్తాన్: ఎఫ్ఎటిఎఫ్ నిర్ణయం
- February 23, 2018
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక అండదండలందిస్తున్న ఆరోపణలెదుర్కొంటున్న పాకిస్తాన్పై నిఘా పెంచుతూ ఆ దేశాన్ని 'గ్రే లిస్ట్'లో చేర్చాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) నిర్ణయించింది. 1989లో ఏర్పడిన ఈ అంతర్ ప్రభుత్వ వ్యవస్థలో వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా వుంటారు. ఉగ్ర ఆర్థిక సాయం, మనీలాండరింగ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే నేరాలపై పోరులో అవసరమైన ప్రమాణాలను ఏర్పాటు చేయటం, వాటిని అమలు చేసేందుకు అవసరమైన చట్టపరమైన, నియంత్రణా, నిర్వహణా చర్యలు తీసుకోవటం ఈ వ్యవస్థ ఏర్పాటు ముఖ్యోద్దేశం. పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టాలన్న ప్రతిపాదనపై తొలుత వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని చైనా ఉపసంహరించుకోవటంతో ఈ అంశంపై ఏకగ్రీవ నిర్ణయానికి మార్గం సుగమమైంది. ఉగ్ర ఆర్థిక సాయం విషయంలో పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టే అంశంపై జరిగిన ప్రాథమిక చర్చలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









