'గ్రే లిస్ట్'లోకి పాకిస్తాన్: ఎఫ్ఎటిఎఫ్ నిర్ణయం
- February 23, 2018
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక అండదండలందిస్తున్న ఆరోపణలెదుర్కొంటున్న పాకిస్తాన్పై నిఘా పెంచుతూ ఆ దేశాన్ని 'గ్రే లిస్ట్'లో చేర్చాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) నిర్ణయించింది. 1989లో ఏర్పడిన ఈ అంతర్ ప్రభుత్వ వ్యవస్థలో వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా వుంటారు. ఉగ్ర ఆర్థిక సాయం, మనీలాండరింగ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే నేరాలపై పోరులో అవసరమైన ప్రమాణాలను ఏర్పాటు చేయటం, వాటిని అమలు చేసేందుకు అవసరమైన చట్టపరమైన, నియంత్రణా, నిర్వహణా చర్యలు తీసుకోవటం ఈ వ్యవస్థ ఏర్పాటు ముఖ్యోద్దేశం. పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టాలన్న ప్రతిపాదనపై తొలుత వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని చైనా ఉపసంహరించుకోవటంతో ఈ అంశంపై ఏకగ్రీవ నిర్ణయానికి మార్గం సుగమమైంది. ఉగ్ర ఆర్థిక సాయం విషయంలో పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టే అంశంపై జరిగిన ప్రాథమిక చర్చలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







