'గ్రే లిస్ట్'లోకి పాకిస్తాన్: ఎఫ్ఎటిఎఫ్ నిర్ణయం
- February 23, 2018
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక అండదండలందిస్తున్న ఆరోపణలెదుర్కొంటున్న పాకిస్తాన్పై నిఘా పెంచుతూ ఆ దేశాన్ని 'గ్రే లిస్ట్'లో చేర్చాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) నిర్ణయించింది. 1989లో ఏర్పడిన ఈ అంతర్ ప్రభుత్వ వ్యవస్థలో వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా వుంటారు. ఉగ్ర ఆర్థిక సాయం, మనీలాండరింగ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే నేరాలపై పోరులో అవసరమైన ప్రమాణాలను ఏర్పాటు చేయటం, వాటిని అమలు చేసేందుకు అవసరమైన చట్టపరమైన, నియంత్రణా, నిర్వహణా చర్యలు తీసుకోవటం ఈ వ్యవస్థ ఏర్పాటు ముఖ్యోద్దేశం. పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టాలన్న ప్రతిపాదనపై తొలుత వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని చైనా ఉపసంహరించుకోవటంతో ఈ అంశంపై ఏకగ్రీవ నిర్ణయానికి మార్గం సుగమమైంది. ఉగ్ర ఆర్థిక సాయం విషయంలో పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టే అంశంపై జరిగిన ప్రాథమిక చర్చలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







