'గ్రే లిస్ట్'లోకి పాకిస్తాన్: ఎఫ్ఎటిఎఫ్ నిర్ణయం
- February 23, 2018
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక అండదండలందిస్తున్న ఆరోపణలెదుర్కొంటున్న పాకిస్తాన్పై నిఘా పెంచుతూ ఆ దేశాన్ని 'గ్రే లిస్ట్'లో చేర్చాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) నిర్ణయించింది. 1989లో ఏర్పడిన ఈ అంతర్ ప్రభుత్వ వ్యవస్థలో వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా వుంటారు. ఉగ్ర ఆర్థిక సాయం, మనీలాండరింగ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే నేరాలపై పోరులో అవసరమైన ప్రమాణాలను ఏర్పాటు చేయటం, వాటిని అమలు చేసేందుకు అవసరమైన చట్టపరమైన, నియంత్రణా, నిర్వహణా చర్యలు తీసుకోవటం ఈ వ్యవస్థ ఏర్పాటు ముఖ్యోద్దేశం. పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టాలన్న ప్రతిపాదనపై తొలుత వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని చైనా ఉపసంహరించుకోవటంతో ఈ అంశంపై ఏకగ్రీవ నిర్ణయానికి మార్గం సుగమమైంది. ఉగ్ర ఆర్థిక సాయం విషయంలో పాకిస్తాన్ను గ్రేలిస్ట్లో పెట్టే అంశంపై జరిగిన ప్రాథమిక చర్చలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి