భారత్ లో పాతికేళ్ళ క్రితం 60 ఫిల్స్ ను తస్కరించినందుకు ఆసుపత్రి సిబ్బందికి జైలు శిక్ష

- November 27, 2015 , by Maagulf
భారత్ లో పాతికేళ్ళ క్రితం 60 ఫిల్స్ ను తస్కరించినందుకు ఆసుపత్రి సిబ్బందికి జైలు శిక్ష

1989 వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ విధానంలో తప్పుడు లెక్కలు చెప్పి 11 రూపాయలు (17 సెంట్లు, 60 ఫిల్స్) ను తస్కరించినందుకు ఒక నర్సు మరియు ఒక మెడికల్ అసిస్టెంట్ లను దోషులుగా నిర్ధారించి భారతీయ న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. మిలియన్ల రూపాయలను స్వాహ చేసిన వారు హాయిగా ఉన్న దేశంలో,  10 సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన నూర్జహాన్ మరియు శోభా రామ్  లకు శిక్ష విధించడం పై తాము పైకోర్టుకు వెళతామని, ఈ తీర్పులో సమతూకం లేదని; వారు ఈ కేసును ఎదుర్కోవడానికి,  కోర్టు వాయిదాలకు హాజరు కావడానికి ఇప్పటికే మూడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టారని డిఫెన్స్ లాయర్ అంటుండగా, పబ్లిక్ ప్రాసిక్యుటార్ దేవకీ నందన్ శర్మ- ఈ నేరానికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడవలసి ఉండగా కోర్టు వారు కనికరం చూపించారని, చాల సమయం తీసుకున్నప్పటికీ న్యాయం గెలుస్తుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com