'పిజ్జా' దర్శకుడితో రజని
- February 24, 2018
రజనీకాంత్ కోరుకుంటే... అగ్ర దర్శకులంతా ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. సినిమాలు తీయడానికి పోటీ పడతారు. కానీ రజనీ ఆలోచనలు మారాయి. ఆయన యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 'కబాలి', 'కాలా' రెండూ పా.రంజిత్తో పనిచేసిన చిత్రాలే. ఇప్పుడు మరో కుర్ర దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. తనే... కార్తీక్ సుబ్బరాజు. తమిళనాట 'పిజ్జా'ని రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారాయన. రెండో చిత్రం 'జిగడ్తాండ' కూడా విమర్శకుల్ని మెప్పించింది. తను రజనీ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. అది తలైవాకి నచ్చింది. 'కాలా' తరవాత సెట్స్పైకి వెళ్లే చిత్రం ఇదే కావొచ్చు. రజనీ 'కాలా' ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఆ తరవాత '2.ఓ' వస్తుంది. ఈలోగా కార్తిక్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







