యుద్ధభూమి' సినిమా ట్రైలర్ విడుదల
- February 24, 2018
హైదరాబాద్: మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, అల్లు శిరీష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం '1971: బియాండ్ బోర్డర్స్'. మేజర్ రవి దర్శకుడు. గతేడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ను తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాను 'యుద్ధభూమి: 1971 భారత సరిహద్దు' పేరుతో తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం 'యుద్ధభూమి' థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసింది. 1971లో భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో మోహన్లాల్ కల్నల్ మహదేవన్ పాత్ర పోషించగా, అల్లు శిరీష్ లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపించనున్నారు. 'వార్ ఫీల్డ్లో లవ్ లెటర్స్కు రొమాన్స్కి నో టైమ్' అంటూ అల్లు శిరీష్కు మోహన్లాల్ సలహా ఇస్తూ కనిపించారు. సిద్ధార్థ్ విపిన్, నజీమ్ అర్షద్, రాహుల్ సుబ్రమణియన్లు సంగీతం అందించగా, గోపీ సుందర్ నేపథ్య సంగీతం అందించారు. జస్రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







