ముంబైకి చేరుకున్న శ్రీదేవి పార్థివ దేహం...
- February 27, 2018
అతిలోక సుందరి శ్రీదేవి పార్థివ దేహం ముంబైకి చేరుకుంది. దుబాయ్ నుంచి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో భౌతిక కాయాన్ని శ్రీదేవి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఎయిర్పోర్టు నుంచి శ్రీదేవి నివాసం వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
అంత్యక్రియలను బుదవారం మధ్యాహ్నం విల్లాపార్లేలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. సినీప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో శ్రీదేవి భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి శ్మశానానికి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత అంత్యక్రియలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







