ముంబైకి చేరుకున్న శ్రీదేవి పార్థివ దేహం...

- February 27, 2018 , by Maagulf
ముంబైకి చేరుకున్న శ్రీదేవి పార్థివ దేహం...

అతిలోక సుందరి శ్రీదేవి  పార్థివ దేహం  ముంబైకి చేరుకుంది.  దుబాయ్ నుంచి స్పెషల్‌ చార్టెడ్‌ ఫ్లైట్‌లో భౌతిక కాయాన్ని శ్రీదేవి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీదేవి నివాసం వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.  

అంత్యక్రియలను బుదవారం మధ్యాహ్నం విల్లాపార్లేలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. సినీప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో  శ్రీదేవి భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి శ్మశానానికి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత అంత్యక్రియలను నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com