కువైట్ - కోచి సర్వీసును ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా
- February 28, 2018
కువైట్: మార్చి 25 నుంచి కువైట్ నుంచి కోచి వరకు కొత్త శీతాకాల షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. ఈ కొత్త మార్గం కువైట్ నుంచి కొచ్చికి వయా ధమ్మం వారానికి మూడుసార్లు ఉంటుంది. ఈ కువైట్ - కోచి సర్వీసు బుధవారం, శుక్రవారం, ఆదివారాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఫ్లైట్ ఐఎక్స్ - 495 విమానం ఉదయం 8.15 గంటలకు కోచిలో బయలుదేరి , అదేరోజు ఉదయం కువైట్ లో 10.55 గంటలకు చేరుకొంటుంది. అలాగే కువైట్ లో కోచికి బయలుదేరే విమానం ఉదయం 11.55 గంటలకు కువైట్ లో బయలుదేరి వయా ధమ్మం మీదుగా కోచికి 9.05 గంటలకు చేరుకొంటుంది.. ఈ కొత్త మార్గం ఇప్పటికే ఉన్న కువైట్ - కోజికోడ్- కొచ్చి మార్గంలో అదనంగా ఉంది. అల్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె . శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది లాభాన్ని సంపాదించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ భరోసానిచ్చింది. బడ్జెట్ లాభం రూ .208 కోట్లు, కాని అసలు లాభం రూ. 250 కోట్లు రావచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 297 కోట్ల కంటే తక్కువగా ఆదాయం ఉంది. ఎందుకంటే ఇంధన ధరలలో 7 నుంచి 10 శాతం పెంపు, ముఖ్యంగా ఎకానమీ క్లాసులో ఆ విధంగా జరిగింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు 90 శాతం గల్ఫ్ దేశాల్లోనే ఉన్నాయి.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







