క్రైస్తవులు, ముస్లింలకు మధ్య ఘర్షణ,13 మంది మృతి
- February 28, 2018
సెంట్రల్ నైజీరియాలో క్రైస్తవులు, ముస్లిం యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో చాలా వరకు ఇండ్లు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కదునా స్టేట్ రాజధాని కదునా పట్టణంలో ఈ ఘర్షణలు నెలకొన్నాయి. ఘర్షణకు కారణమైన 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్కమిషనర్ ఆస్టిన్ ఐవర్ తెలిపారు. భద్రతా దళాలు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చాయిని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఐవర్ వెల్లడించారు. కొందరు క్రైస్తవ అమ్మాయిలు, ముస్లిం యువకులతో సన్నిహితంగా ఉండటమే ఈ ఘర్షణకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అప్పుడే నిర్ధారణకు రాలేమని..పూర్తి దర్యాప్తు చేపడుతామని ఆస్టిన్ ఐవర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







