క్రైస్తవులు, ముస్లింలకు మధ్య ఘర్షణ,13 మంది మృతి
- February 28, 2018
సెంట్రల్ నైజీరియాలో క్రైస్తవులు, ముస్లిం యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో చాలా వరకు ఇండ్లు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కదునా స్టేట్ రాజధాని కదునా పట్టణంలో ఈ ఘర్షణలు నెలకొన్నాయి. ఘర్షణకు కారణమైన 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్కమిషనర్ ఆస్టిన్ ఐవర్ తెలిపారు. భద్రతా దళాలు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చాయిని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఐవర్ వెల్లడించారు. కొందరు క్రైస్తవ అమ్మాయిలు, ముస్లిం యువకులతో సన్నిహితంగా ఉండటమే ఈ ఘర్షణకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అప్పుడే నిర్ధారణకు రాలేమని..పూర్తి దర్యాప్తు చేపడుతామని ఆస్టిన్ ఐవర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







