త్వరలో ట్యాక్సీలకు మీటర్లు తప్పనిసరి: అల్ ఫుతైసి
- March 01, 2018
మస్కట్: మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ ఫుతైసి, ఒమన్లో అన్ని ట్యాక్సీలకు త్వరలో మీటర్లు తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించారు. మస్కట్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన అల్ ఫుతైసి, కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఒమన్లో అన్ని ట్యాక్సీలకూ మీటర్లు తప్పనిసరి. ఇప్పటికిప్పుడు అది కొంచెం కష్టతరమే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారాయన. మీటర్ లేని ట్యాక్సీలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మవసలాట్ 10 కొత్త రూట్స్ని ప్రారంభించనున్నట్లు కూడా వివరించారు అల్ ఫుతైసి. కొత్త సర్వీసులు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయనీ, ఈ తరహా విస్తరణతో మవసలాత్ బస్సులకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోందని అల్ ఫుతైసి చెప్పారు.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









