నేషనల్ హాలిడేస్ తర్వాత 3 రోజులు సిక్ లీవ్లు తీసుకొన్న 40 వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు
- March 01, 2018
కువైట్: అరుదుగా వరుసగా సెలవుల పొందే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోలేదా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు చెందిన 40 వేల మంది ఉద్యోగులు మూడు రోజుల పాటు సిక్ లీవ్ తీసుకున్నారు. సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) ఆదివారం, ఫిబ్రవరి 25, సోమవారం, ఫిబ్రవరి 26 న అధికారిక సెలవులుగా ప్రకటించింది. 57 వ స్వాతంత్ర్య దినోత్సవం మరియు కువైట్ యొక్క 27 వ లిబరేషన్ డే గుర్తుగా ఈ సెలవులు వారాంతాన్ని అనుసరిస్తూ ఉండటంతో, పని నుండి మొత్తం నాలుగు రోజులు సెలవులు అయినప్పటికీ, దిరికిందే తడవుగా గత నెల ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 ( శనివారం) వరకు తొమ్మిది రోజులకు సెలవులను పొడిగించటానికి అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు అనారోగ్య సెలవును తీసుకున్నారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం, సి ఎస్ సి అధికారులు ఉద్యోగులు పెట్టిన సెలవులు వాస్తవమైనవా కాదా అని నిర్ణయించడానికి వారి వారి సిక్ లీవ్ లను పరిశీలిస్తున్నారు. ఏ ప్రభుత్వ వుద్యోగైనా చట్టాలు మరియు నిబంధనలను ప్రకారం నిరూపించబడకాపోతే చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. సిక్ లీవ్ లను పెట్టిన రోగుల ఆరోగ్య రికార్డులను అధ్యయనం చేయటం మరియు సిక్ లీవ్ దినంను సమర్ధిస్తూ సంతకం చేసిన వైద్యులపై దర్యాప్తు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









