ఏప్రియల్ 1 నుంచి..విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేయనున్న సౌదీ అరేబియా

- March 02, 2018 , by Maagulf
ఏప్రియల్ 1 నుంచి..విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేయనున్న సౌదీ అరేబియా

రియాద్: ' చమురు లో వచ్చిన నష్టం ..పర్యాటకంలో పూరించుకోవాలని ' సౌదీ అరేబియా గత కొంతకాలం చక్కని వ్యూహాలతో ఆర్ధిక రంగాన్ని అదుపులో పెడుతుంది.  ‘విజన్ 2030’ ప్రణాళికను అమలుచేసే భాగంగా ఈ ఏడాది ఏప్రియల్ 1 నుంచి విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సాల్మాన్ అంగీకరించారు. 2030 నాటికి ఏడాదికి 30 లక్షల మంది సౌదీలో పర్యటింపచేయడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులను పర్యటానికి అనుమతిస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము పర్యాటక వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చేవారికి వీసాలు జారీ చేయనున్నామని సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునేవారికి ఇది చల్లని కబురేనని పలువురు పర్యటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com