ఏప్రియల్ 1 నుంచి..విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేయనున్న సౌదీ అరేబియా
- March 02, 2018
రియాద్: ' చమురు లో వచ్చిన నష్టం ..పర్యాటకంలో పూరించుకోవాలని ' సౌదీ అరేబియా గత కొంతకాలం చక్కని వ్యూహాలతో ఆర్ధిక రంగాన్ని అదుపులో పెడుతుంది. ‘విజన్ 2030’ ప్రణాళికను అమలుచేసే భాగంగా ఈ ఏడాది ఏప్రియల్ 1 నుంచి విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సాల్మాన్ అంగీకరించారు. 2030 నాటికి ఏడాదికి 30 లక్షల మంది సౌదీలో పర్యటింపచేయడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులను పర్యటానికి అనుమతిస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము పర్యాటక వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చేవారికి వీసాలు జారీ చేయనున్నామని సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునేవారికి ఇది చల్లని కబురేనని పలువురు పర్యటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







