ఏప్రియల్ 1 నుంచి..విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేయనున్న సౌదీ అరేబియా
- March 02, 2018
రియాద్: ' చమురు లో వచ్చిన నష్టం ..పర్యాటకంలో పూరించుకోవాలని ' సౌదీ అరేబియా గత కొంతకాలం చక్కని వ్యూహాలతో ఆర్ధిక రంగాన్ని అదుపులో పెడుతుంది. ‘విజన్ 2030’ ప్రణాళికను అమలుచేసే భాగంగా ఈ ఏడాది ఏప్రియల్ 1 నుంచి విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సాల్మాన్ అంగీకరించారు. 2030 నాటికి ఏడాదికి 30 లక్షల మంది సౌదీలో పర్యటింపచేయడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులను పర్యటానికి అనుమతిస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము పర్యాటక వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చేవారికి వీసాలు జారీ చేయనున్నామని సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునేవారికి ఇది చల్లని కబురేనని పలువురు పర్యటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









