పర్యాటక రంగంపై దృష్టి సారించనున్న సౌదీ
- March 03, 2018
రియాద్: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుుంది. చమురు ఉత్పత్తి ద్వారా ఇన్నాళ్లూ ఆదాయం ఆర్జించిన సౌదీ ఇప్పుడు రూటు మార్చింది. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని భావిస్తున్న ఆ దేశం తాజాగా పర్యాటకరంగం నుంచి ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది.
ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి 'విజన్ 2030' ప్రణాళికను అమలు చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పచ్చజెండా ఊపారు.
2030 నాటికి ఏడాదికి 30 మిలియన్ల మంది సౌదీలో పర్యటించేలా చేయడమే ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులకు టూరిస్టు వీసాలు జారీ చేస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము కూడా టూరిస్టు వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.
అంతేకాదు.. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చే వారికి కూడా అవసరమైన వీసాలు జారీ చేయనున్నట్లు సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునే వారికి ఇది శుభవార్తేనని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు.
వచ్చే జూన్లో సౌదీ ఆరేబియా రాజుగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రస్తుత యువరాజు సల్మాన్ పలు కీలకమైన సంస్కరణలకు నడుం బిగించారు. మహిళలకు కారు డ్రైవింగ్ అనుమతితోపాటు, సౌదీ చరిత్రలో మొదటిసారిగా మగవారి తోడు లేకుండా మహిళలకు ప్రయాణానికి అనుమతి, సినిమా థియేటర్లు తెరవడం వంటి కొన్ని కీలక సంస్కరణ చేశారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









