పర్యాటక రంగంపై దృష్టి సారించనున్న సౌదీ
- March 03, 2018
రియాద్: సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుుంది. చమురు ఉత్పత్తి ద్వారా ఇన్నాళ్లూ ఆదాయం ఆర్జించిన సౌదీ ఇప్పుడు రూటు మార్చింది. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని భావిస్తున్న ఆ దేశం తాజాగా పర్యాటకరంగం నుంచి ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది.
ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి 'విజన్ 2030' ప్రణాళికను అమలు చేయనుంది. ఈ ప్రణాళికలో భాగంగా విదేశీయులకు పర్యాటక వీసాలు జారీ చేసేందుకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పచ్చజెండా ఊపారు.
2030 నాటికి ఏడాదికి 30 మిలియన్ల మంది సౌదీలో పర్యటించేలా చేయడమే ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. తమ దేశ పౌరులకు టూరిస్టు వీసాలు జారీ చేస్తున్న అన్నీ దేశాల పౌరులకు తాము కూడా టూరిస్టు వీసాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.
అంతేకాదు.. వ్యాపారాల నిమిత్తం, భక్తులు, కుటుంబ సభ్యులను సందర్శించేందుకు సౌదీ వచ్చే వారికి కూడా అవసరమైన వీసాలు జారీ చేయనున్నట్లు సౌదీ వెల్లడించింది. దీంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో పర్యటించాలనుకునే వారికి ఇది శుభవార్తేనని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు.
వచ్చే జూన్లో సౌదీ ఆరేబియా రాజుగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రస్తుత యువరాజు సల్మాన్ పలు కీలకమైన సంస్కరణలకు నడుం బిగించారు. మహిళలకు కారు డ్రైవింగ్ అనుమతితోపాటు, సౌదీ చరిత్రలో మొదటిసారిగా మగవారి తోడు లేకుండా మహిళలకు ప్రయాణానికి అనుమతి, సినిమా థియేటర్లు తెరవడం వంటి కొన్ని కీలక సంస్కరణ చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







