ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్!
- March 03, 2018
షార్జా: గల్ఫ్ దేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. షార్జా నగర వేదికగా పనిచేస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ అరేబియా బంఫరాఫర్ ప్రకటించింది. యూఏఈ నుంచి భారత్ వెళ్లాలనుకునే వారికి తక్కువ ధరలకే విమాన టికెట్ అందిస్తామని ప్రకటించింది.
అయిన వారికి దూరంగా ఎక్కడో ఎడారి దేశాల్లో ఉంటోన్న ఎంతోమంది స్వదేశానికి వచ్చి తమ కుటుంబ సభ్యులను చూడాలని ఉన్నా విమాన టిక్కెట్ ధరలు భరించలేక ఆ కోరికను తమలోనే దిగమింగుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇది ఎంతో ఊరట కలిగించే విషయమే.
షార్జా నుంచి తిరువనంతపురానికి కేవలం 274 దిర్హమ్స్ మాత్రమే వసూలు చేస్తామని ఎయిర్ అరేబియా ప్రకటించింది. అంతేకాకుండా ఇతర నగరాలైన కొచ్చికి 280 దిర్హమ్స్, కోయంబత్తూర్ 350 దిర్హమ్స్, బెంగళూరు 345 దిర్హమ్స్కే టికెట్ అందిస్తామని ప్రకటించింది.
ఒక్క భారత్కే కాకుండా పలు ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ల ఈ విమానయాన సంస్థ అందించింది. విమాన టికెట్ ధరలను తగ్గించి ప్రయాణికులను ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









