ఈ నెల 29న 'ఇరుంబు తిరై' విడుదల సన్నాహాలు
- March 03, 2018
విశాల్ హీరోగా సొంత బ్యానరు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న చిత్రం 'ఇరుంబు తిరై'. మిత్రన్ దర్శకత్వంలోని ఈ సినిమాలో సమంత కథానాయిక. అర్జున్ విలన్ పాత్ర పోషించారు. విశాల్ గురువు అర్జున్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా వాణిజ్య పనులు ఊపందుకున్నాయి. కేరళ మార్కెట్కు సంబంధించిన హక్కులను శిబు తమీమ్ సొంతం చేసుకున్నారు. విజయ్ నటించిన 'పులి', విక్రం నటించిన 'ఇరుముగన్' చిత్రాలను గతంలో నిర్మించారు శిబు. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విక్రం నటిస్తున్న 'సామి స్క్వేర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశాల్కు కేరళలో మార్కెట్ బాగుంది. అందుకే మరింత గ్రాండ్గా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు తమిళంలో కూడా పంపిణీ పనులు ఆరంభమయ్యాయి. మార్చి 29వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు.a
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









