నేడు హైదరాబాద్లో అతిలోక సుందరికి సంతాప సభ
- March 03, 2018
హైదరాబాద్: అతిలోకసుందరి, లెజండరీ నటి, ఇండియన్ స్టార్ శ్రీదేవి.. కోట్లాది మంది అభిమానులను, వేలాదిమంది నటీనటులను విషాదంలోకి నెట్టేసి తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చనిపోలేదని ఇదంతా కలయేనని కొందరు వీరాభిమానులు, ఆరాధ్యులు భ్రమలో ఉన్నారంటే శ్రీదేవి రేంజ్ ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. కాగా ఆమె అంత్యక్రియలు టాలీవుడ్ ప్రముఖులు తరలివెళ్లిన విషయం విదితమే.
అయితే శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి టాలీవుడ్ ఓ వేదికను ఏర్పాటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో ఆదివారం ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు సంతాప సభ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు సంతాప సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలిసింది. కాగా ఈ సందర్భంగా ఆర్జీవీ సభలో ప్రసగించనున్నారని.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వరుస ట్వీట్లు, శ్రీదేవి అభిమానులకు లేఖ ఇలా ఆర్జీవీలోని బాధనంతా బయటపెట్టినప్పటికీ పాపం.. ఇంకా విషాదంలో నుంచి కోలుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







