నేడు హైదరాబాద్లో అతిలోక సుందరికి సంతాప సభ
- March 03, 2018
హైదరాబాద్: అతిలోకసుందరి, లెజండరీ నటి, ఇండియన్ స్టార్ శ్రీదేవి.. కోట్లాది మంది అభిమానులను, వేలాదిమంది నటీనటులను విషాదంలోకి నెట్టేసి తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చనిపోలేదని ఇదంతా కలయేనని కొందరు వీరాభిమానులు, ఆరాధ్యులు భ్రమలో ఉన్నారంటే శ్రీదేవి రేంజ్ ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. కాగా ఆమె అంత్యక్రియలు టాలీవుడ్ ప్రముఖులు తరలివెళ్లిన విషయం విదితమే.
అయితే శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి టాలీవుడ్ ఓ వేదికను ఏర్పాటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో ఆదివారం ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు సంతాప సభ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు సంతాప సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలిసింది. కాగా ఈ సందర్భంగా ఆర్జీవీ సభలో ప్రసగించనున్నారని.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వరుస ట్వీట్లు, శ్రీదేవి అభిమానులకు లేఖ ఇలా ఆర్జీవీలోని బాధనంతా బయటపెట్టినప్పటికీ పాపం.. ఇంకా విషాదంలో నుంచి కోలుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









