నేడు హైదరాబాద్లో అతిలోక సుందరికి సంతాప సభ
- March 03, 2018
హైదరాబాద్: అతిలోకసుందరి, లెజండరీ నటి, ఇండియన్ స్టార్ శ్రీదేవి.. కోట్లాది మంది అభిమానులను, వేలాదిమంది నటీనటులను విషాదంలోకి నెట్టేసి తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చనిపోలేదని ఇదంతా కలయేనని కొందరు వీరాభిమానులు, ఆరాధ్యులు భ్రమలో ఉన్నారంటే శ్రీదేవి రేంజ్ ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. కాగా ఆమె అంత్యక్రియలు టాలీవుడ్ ప్రముఖులు తరలివెళ్లిన విషయం విదితమే.
అయితే శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి టాలీవుడ్ ఓ వేదికను ఏర్పాటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో ఆదివారం ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు సంతాప సభ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు సంతాప సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, నివేదా థామస్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినీ దర్శకులు రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలిసింది. కాగా ఈ సందర్భంగా ఆర్జీవీ సభలో ప్రసగించనున్నారని.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వరుస ట్వీట్లు, శ్రీదేవి అభిమానులకు లేఖ ఇలా ఆర్జీవీలోని బాధనంతా బయటపెట్టినప్పటికీ పాపం.. ఇంకా విషాదంలో నుంచి కోలుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







