ఆస్కార్‌ వేదికపై శశికపూర్‌, శ్రీదేవికి నివాళులు

- March 05, 2018 , by Maagulf
ఆస్కార్‌ వేదికపై శశికపూర్‌, శ్రీదేవికి నివాళులు

న్యూయార్క్‌ : 90వ ఆస్కార్‌ అవార్డుల వేదికపై మృతి చెందిన భారతీయ నటులు శశికపూర్‌, శ్రీదేవిలకు నివాళులర్పించారు. ఆస్కార్‌ అవార్డులు ప్రకటించే ముందు మృతి చెందిన చలనచిత్ర ప్రముఖులకు నివాళులర్పించడం సంప్రదాయంగా వస్తోంది. వీరిద్దరూ నటించిన పలు చిత్రాల్ని బిగ్‌ స్క్రీన్‌ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవల్ని సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి, శశి కపూర్‌లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్‌ (పెరల్‌ జామ్‌ ఫేమ్‌) ప్రదర్శన జరిగింది. 'ఇన్‌ మెమొరియం' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్‌ బాండ్‌ చిత్రాల నిర్మాత, దర్శకుడు రోజర్‌ మౌరేలకు కూడా నివాళులర్పించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు మేరీ గోల్డ్‌బెర్గ్‌, జోహాన్‌ జోహౌన్సన్‌, జాన్‌ హెర్డ్‌, శామ్‌ షెఫర్డ్‌లకు కూడా నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com