మలేషియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
- March 06, 2018
మలేషియాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువకులకు టోకరా,ఒక్కొక్కరి దగ్గర సుమారు లక్ష రూపాయలు నుండి రెండు లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు వేంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లి గరుగు వీధికి చెందిన ఫక్రుద్దీన్, అతను అల్లుడు సలీమ్ ఇద్దరు ఏజెంట్లు కలిసి మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువకుల వద్ద నుంచి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేసి వారికి టూరిస్టు విసా ఇచ్చి మలేషియా విమానం ఎక్కించారు.టూరిస్టు విసా సమయం గడువు ముగియగానే మలేషియా పోలీసులు వారిని అరెస్టు చేసి జైల్లో ఉంచారు. మోసపోయిన బాధితులు ఎలాగోలా కష్టపడి స్వదేశానికి తిరిగి వచ్చారు.వారిని ఏజెంటు మళ్ళీ మలేషియా పంపించాడు. రెండో సారి కూడా టూరిస్టు విసాతోనే పంపించాడు.వారిని మలేషియా పోలీసులు ఎయిర్ పోర్ట్లోనే అరెస్ట్ చేసి నాలుగు రోజుల తర్వాత తిరిగి వెనక్కి పంపారు. మంగళవారం యర్రగుంట్ల మండలం చిలమకూరుకు చెందిన బాధితులు షేక్.సాధక్ వల్లి,షేక్.ఇమామ్,షేక్.గపూర్, షేక్.ఖాసీం పిరా,వేంపల్లికి చెందిన నరేష్,కడపకు చెందిన శ్రీనివాసులు కలిసి ఏజెంటు ఫక్రుద్దీన్ ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వాలని అడిగారు.అతను వారికి సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోపోండి అని దురుసుగా మాట్లాడటంతో దిక్కు తోచని స్థితిలో బాధితులు వేంపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఎస్ఐ బి.వి.చలపతి మాట్లాడుతూ ఏజెంటు ఫక్రుద్దీన్ను విచారించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







