హైదరాబాద్లో కాల్పుల కలకలం
- March 06, 2018
హైదరాబాద్: నగరంలోని చార్మినార్ సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది. నగల వ్యాపారి ఇంట్లో చొరబడిన దుండగులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఇది చార్మినర్ పరిసర ప్రాంతం కావడంతో మరింత కలకలం రేపుతోంది. సిటీ ఆర్మ్డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్స్ కార్యాలయం వెనుక కొంతమంది నగల వ్యాపారులు చిన్న చిన్న ఖార్కానాలు పెట్టుకుని బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. దుండగులు పక్కా పథకం ప్రకారం 10 నుంచి 15 మంది యువకులు మోటారు బైకులు, కారులో అక్కడకు వచ్చి ఖార్కానాలో పనిచేస్తున్న కార్మికులను తుపాకులతో బెదిరించి..గాలిలోకి కాల్పులు జరిపి... 5 కిలోల బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు హిందీ మాట్లాడారని, హైదరాబాద్కు చెందినవారు కాదని కార్మికులు చెప్పడంతో... ముంబైకి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ దోపిడీ జరిగిన తర్వాత చూస్తే సీసీ కెమెరా వైర్లు కత్తిరించి ఉన్నాయి. పక్కా రెక్కి నిర్వహించి దోపిడీ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చుట్టుప్రక్క ప్రాంతాల, సరిహద్దు పోలీసులకు సమాచారం అందించి నాకాబంది చేస్తున్నారు. దుండగులు రెండు బైకులు సంఘటనా ప్రదేశంలో వదిలి వెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!







