హైదరాబాద్లో కాల్పుల కలకలం
- March 06, 2018
హైదరాబాద్: నగరంలోని చార్మినార్ సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది. నగల వ్యాపారి ఇంట్లో చొరబడిన దుండగులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఇది చార్మినర్ పరిసర ప్రాంతం కావడంతో మరింత కలకలం రేపుతోంది. సిటీ ఆర్మ్డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్స్ కార్యాలయం వెనుక కొంతమంది నగల వ్యాపారులు చిన్న చిన్న ఖార్కానాలు పెట్టుకుని బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. దుండగులు పక్కా పథకం ప్రకారం 10 నుంచి 15 మంది యువకులు మోటారు బైకులు, కారులో అక్కడకు వచ్చి ఖార్కానాలో పనిచేస్తున్న కార్మికులను తుపాకులతో బెదిరించి..గాలిలోకి కాల్పులు జరిపి... 5 కిలోల బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు హిందీ మాట్లాడారని, హైదరాబాద్కు చెందినవారు కాదని కార్మికులు చెప్పడంతో... ముంబైకి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ దోపిడీ జరిగిన తర్వాత చూస్తే సీసీ కెమెరా వైర్లు కత్తిరించి ఉన్నాయి. పక్కా రెక్కి నిర్వహించి దోపిడీ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చుట్టుప్రక్క ప్రాంతాల, సరిహద్దు పోలీసులకు సమాచారం అందించి నాకాబంది చేస్తున్నారు. దుండగులు రెండు బైకులు సంఘటనా ప్రదేశంలో వదిలి వెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









