హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

- March 06, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్: నగరంలోని చార్మినార్ సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది. నగల వ్యాపారి ఇంట్లో చొరబడిన దుండగులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఇది చార్మినర్ పరిసర ప్రాంతం కావడంతో మరింత కలకలం రేపుతోంది. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్స్ కార్యాలయం వెనుక కొంతమంది నగల వ్యాపారులు చిన్న చిన్న ఖార్కానాలు పెట్టుకుని బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. దుండగులు పక్కా పథకం ప్రకారం 10 నుంచి 15 మంది యువకులు మోటారు బైకులు, కారులో అక్కడకు వచ్చి ఖార్కానాలో పనిచేస్తున్న కార్మికులను తుపాకులతో బెదిరించి..గాలిలోకి కాల్పులు జరిపి... 5 కిలోల బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు హిందీ మాట్లాడారని, హైదరాబాద్‌కు చెందినవారు కాదని కార్మికులు చెప్పడంతో... ముంబైకి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ దోపిడీ జరిగిన తర్వాత చూస్తే సీసీ కెమెరా వైర్లు కత్తిరించి ఉన్నాయి. పక్కా రెక్కి నిర్వహించి దోపిడీ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చుట్టుప్రక్క ప్రాంతాల, సరిహద్దు పోలీసులకు సమాచారం అందించి నాకాబంది చేస్తున్నారు. దుండగులు రెండు బైకులు సంఘటనా ప్రదేశంలో వదిలి వెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com