భారత జవానులను భందించిన నేపాల్ భద్రతా బలగాలు
- November 29, 2015
స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భారత సైనికులను నేపాల్ సరిహద్దు భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. నేపాల్ దేశంలోకి అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అనుసరిస్తూ సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ)కు చెందిన ఇద్దరు సైనికులు నేపాల్లోని జపా అనే గ్రామంలోకి ప్రవేశించారు. అయితే వారి వద్ద ఆయుధాలు లేకపోవడం గమనించిన సైనికులు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. నేపాల్ భద్రతా సిబ్బంది అదుపులో ఉన్న ఇద్దరు ఎస్ఎస్బీ సిబ్బందిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మరో 10 మంది సైనికులను కూడా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత సైన్యాధికారులు నేపాల్ ఆర్మీతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







