భారత జవానులను భందించిన నేపాల్ భద్రతా బలగాలు
- November 29, 2015
స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భారత సైనికులను నేపాల్ సరిహద్దు భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. నేపాల్ దేశంలోకి అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అనుసరిస్తూ సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ)కు చెందిన ఇద్దరు సైనికులు నేపాల్లోని జపా అనే గ్రామంలోకి ప్రవేశించారు. అయితే వారి వద్ద ఆయుధాలు లేకపోవడం గమనించిన సైనికులు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. నేపాల్ భద్రతా సిబ్బంది అదుపులో ఉన్న ఇద్దరు ఎస్ఎస్బీ సిబ్బందిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మరో 10 మంది సైనికులను కూడా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత సైన్యాధికారులు నేపాల్ ఆర్మీతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









