నేపాల్లో భారత ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసిన కేబుల్ ఒపెరటర్లు
- November 29, 2015
భారత్ నుంచి నేపాల్ సరకు రవాణా ఆగిపోవడంతో ఆ దేశంలో భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్ మాదేశీ ఫ్రంట్ ఆధ్వర్యంలో నేపాల్లోని కేబుల్ ఆపరేటర్లంతా కలిసి భారత ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. నేపాల్కు సరకు రవాణాను భారత్ అడ్డుకుందని.. అందుకే ఆ దేశ ఛానళ్ల ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.నేపాల్కు వెళ్లే నిత్యావసర వస్తువులను తరలించే ట్రక్కులు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. అయితే భద్రతా కారణాల వల్లే సరకు రవాణా నిలిచిపోయిందని భారత్ చెబుతోంది. ఈ విషయంపై నేపాల్లో భారత రాయబారి రంజిత్ రే మాట్లాడారు. ఇలాంటి ఆందోళనలు దేశంలో భారత్పై వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉన్నాయని.. ఇవి రెండు దేశాలకు హానికరమన్నారు. సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







